breaking news
sixteen Years
-
ఆస్ట్రేలియా టీనేజర్లకు స్క్రీన్ లాకౌట్
మెల్బోర్న్ (ఆస్ట్రేలియా): పదహారేళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించడా న్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బ నీస్ స్వాగతించారు. ప్రపంచంలోనే మొట్టమొ దటిదైన ఈ నిషేధం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే నిషేధం అమలు కష్టంతో కూడుకున్నదని ఆయన హెచ్చరించారు. నిషేధం అమలుతో తమ ఖాతాలు మూతపడినట్లు తెలుసుకున్న పిల్లలు బాధ పడ్డారని తల్లిదండ్రులు తెలిపారు. కొందరు చిన్న పిల్లలు తమ ముఖాలపై మీసాలు, గడ్డం చిత్రించుకుని, సోషల్ మీడియా ప్లాట్ఫాంల వయసు అంచనా సాంకేతికతను మోసం చేయగలిగారని వెల్లడించారు. తల్లిదండ్రులు, అన్నలు లేదా అక్కలు కూడా.. కొంతమంది పిల్లలకు ఈ ఆంక్షలను తప్పించుకోవడానికి సహాయం చేస్తారని భావిస్తున్నారు.కన్నవారికి మనశ్శాంతి తథ్యం‘బిగ్ టెక్ కంపెనీల నుంచి ఆస్ట్రేలియా కు టుంబాలు అధికారాన్ని తిరిగి పొందే రోజు ఇది. పిల్లలు పిల్లల్లా ఉండటానికి, తల్లిదండ్రులకు మరింత ప్రశాంతత లభించడానికి నిషేధం ఉపకరిస్తుంది’.. అని అల్బనీస్.. ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్ప్తో వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా పిల్లలు.. వారి బాల్యాన్ని హాయిగా గడిపేందుకు వీలు కల్పిస్తుంది. ఆస్ట్రేలియా తల్లిదండ్రులకు మరింత మనశ్శాంతినిస్తుంది. ఆస్ట్రేలియా చేయగలిగితే, మనం ఎందుకు చేయలేం?’ అని ప్రపంచ సమాజం ఆస్ట్రేలియా వైపు చూస్తుంది’.. అని అల్బనీస్ చెప్పారు. ఒక బిడ్డ ఆత్మహత్యకు సోషల్ మీడియా కారణమని ఆరోపించే తల్లిదండ్రులతో సహా, సోషల్ మీడియా సంస్కరణ మద్దతుదారుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఉల్లంఘిస్తే భారీ జరిమానాబుధవారం నుంచి 16 ఏళ్లలోపు ఆస్ట్రేలియా పిల్లల ఖాతాలను తొలగించడానికి సహేతుక మైన చర్యలు తీసుకోకపోతే, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, కిక్, రెడ్డిట్, స్నాప్చాట్, థ్రెడ్స్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్ వంటి ప్లాట్ఫాంలు గరిష్టంగా 49.5 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే.. సుమారు 32.9 మిలియన్ల అమెరికన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.క్రిస్మస్ నాటికి నివేదికఈ నిషేధాన్ని ఆస్ట్రేలియాలోని ఈ–సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ అమలు చేస్తారు. వయస్సు పరిమితిని కచ్చితత్వంతో అమలు చేయడానికి ప్లాట్ఫాంల వద్ద ఇప్పటికే సాంకేతికత, వారి వినియోగదారుల వ్యక్తిగత డేటా అందుబాటులో ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. వయసు పరిమితిని ఎలా అమలు చేస్తున్నారు?, ఎన్ని ఖాతాలు మూతపడ్డాయి? అనే అంశంపై సమాచారం ఇవ్వాలని కోరుతూ లక్షిత పది ప్లాట్ఫాంలకు గురువారం నోటీసులు పంపుతానని వెల్లడించారు. ‘ఈ వయస్సు పరిమితులు ఎలా అమలు అవుతున్నాయో, అవి ప్రాథమికంగా పనిచేస్తున్నాయో లేదో క్రిస్మస్ లోపు ప్రజలకు సమాచారం అందిస్తాం’.. అని ఇన్మాన్ గ్రాంట్ చెప్పారు. కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ మాట్లాడుతూ, బుధవారానికి ఆస్ట్రేలియాలో 200,000 కంటే ఎక్కువ టిక్టాక్ ఖాతాలు నిలిపివేసినట్లు వివరించారు. -
పదహారేళ్ల తర్వాత...
పదహారేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలిసింది. చిరంజీవి హీరోగా, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయట. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా శ్రీలీల నటించనున్నారని తెలిసింది. అలాగే చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారని, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఈ విషయాలపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఇక 2006లో వచ్చిన ‘స్టాలిన్’ చిత్రం తర్వాత చిరంజీవి, త్రిష మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. -
లిఫ్ట్ ఇస్తామని చెప్పి బాలికపై లైంగికదాడి
చంద్రగిరి: ద్విచక్ర వాహనంలో లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఇద్దరు యువకులు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఆదివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. 16 ఏళ్ల బాలిక నవంబర్ 24న ఇంట్లో గొడవతో అలిగి తిరుపతికి చేరుకుంది. అదేరోజు అర్ధరాత్రి తిరుపతి పద్మావతీపురం నుంచి కాలినడకన తిరుచానూరుకు వెళుతోంది. ఈ క్రమంలో చిత్తూరుకు చెందిన వెంకటేష్ (31) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బాలిక తిరుచానూరు వరకు లిఫ్ట్ కోరింది. ఆమెను తన వాహనంపై ఎక్కించుకున్నాడు. తిరుచానూరులో ఆమెను వదిలిపెట్టకుండా ముళ్లపూడి వరకు తీసుకెళ్లాడు. అక్కడ వాహనాన్ని ఆపి, పెట్రోల్ అయిపోయిందని ఆమెను నమ్మించాడు. స్నేహితుడు బుక్కే రాజమోహన్నాయక్ (28)ను పెట్రోల్ తీసుకురమ్మని చెప్పినట్లు పేర్కొన్నాడు. రాజమోహన్నాయక్ రాగానే ఇద్దరూ రోడ్డుపై నుంచి ఆమెను బలవంతంగా ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి, లైంగికదాడి చేశారు. ఆమె అరుపులతో స్థానికులు అక్కడకు చేరుకోవడంతో పారిపోయారు. ఘటనను బాలిక ఏడుస్తూ తల్లిదండ్రులకు వివరించింది. వారు తిరుచానూరుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శనివారం ఇద్దరు నిందితులను తిరుచానూరులో అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాజమోహన్నాయక్పై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. -
అమ్మ రావడంతో ఆశ్చర్యానికి గురయ్యా..
మణిపూర్: మణిపూర్ ఉక్కు మహిళ, హక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిల తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఆమె తల్లి సఖి కలవడానికి రావడమే ఇందుకు కారణం. అమ్మ తనను కలడానికి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యానని షర్మిల అన్నారు. మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని ఆమె పదహారేళ్లుగా నిరశన దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన తల్లి తనను కలవడానికి వస్తే మనసు మార్చుకొని దీక్షను విరమించాల్సి వస్తుందని ఆమె ఇన్నాళ్లూ తల్లికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు దీక్షను విరమించడంతో కుమార్తెను తల్లి కలిశారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టానికి వ్యతిరేకంగా ఇరోమ్ షర్మిల 2000 సంవత్సరం నుంచి నిరశన దీక్షను కొనసాగించారు. ఇటీవలే ఆగస్టు 9 న తన దీక్షను విరమించారు. తాను వివాహం చేసుకుంటానని త్వరలోనే రాజకీయాలలో చేరుతానని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.


