Adipurush Pre Release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఖర్చు ఎన్ని కోట్లంటే?

Adipurush makers spent Amount For Pre Release Event at Tirupathi - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాగా.. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు.

(ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్.. ఆ సాంగ్ వచ్చేసింది)

ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీస్థాయిలో హైప్ క్రియేట్ అయింది. తాజాగా తిరుపతిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. జూన్ 6న జరుగుతున్న ఈవెంట్‌కు మేకర్స్ భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది. 

తిరుపతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈవెంట్ కావడంతో చిత్రబృందం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. కేవలం క్రాకర్స్ కోసమే ఆదిపురుష్ నిర్మాతలు రూ.50 లక్షలు ఖర్చు చేశారని సమాచారం. ఈ వేడుకలో ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ పాల్గొననుండడంతో అభిమానులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. దీంతో పెద్దఎత్తున నిర‍్వహిస్తున్న ఈవెంట్‌ కోసం చిత్రబృందం దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) స్టేడియంలో ఈ వేడుక జరుగుతోంది. అయితే ఈవెంట్‌ ఖర్చు విషయంపై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

(ఇది చదవండి: ‘ఆదిపురుష్‌’ థియేటర్‌లో అక్కడ ఎవరూ కూర్చోకండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top