విదేశాల నుంచి కూతురు వచ్చాకే అంత్యక్రియలు.. | - | Sakshi
Sakshi News home page

విదేశాల నుంచి కూతురు వచ్చాకే అంత్యక్రియలు..

Jan 2 2024 12:30 AM | Updated on Jan 2 2024 10:53 AM

- - Sakshi

కరీంనగర్: కొత్త ఏడాది సందర్భంగా దైవదర్శనం కోసం ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొని మృత్యువాత పడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాకేంద్రంలోని మహాలక్ష్మీనగర్‌కు చెందిన సామ సుజాతరెడ్డి, హేమేందర్‌ రెడ్డి దంపతులు. సుజాతరెడ్డి (45) గృహిణి. సోమవారం ఉదయం పొలాస గ్రామంలోని పౌలస్తేశ్వరస్వామి దర్శనానికి ద్విచక్రవాహనంపై బయల్దేరింది. జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారి వెళ్దుండగా.. ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది.

ఈ ఘటనలో సుజాత తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించేలోపే మృతిచెందింది. రూరల్‌ సీఐ ఆరీఫ్‌అలీఖాన్‌, ఎస్సై సదాకర్‌ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆస్పత్రికి చేరుకుని మృతురాలి కుటుంబసభ్యులను ఓదార్చారు. హేమేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై సదాకర్‌ తెలిపారు. సుజాతరెడ్డికి ఒకే కూతురు సంతానం. ఆమె విదేశాల్లో ఉన్నారు. ఆమె వచ్చాకే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెల్సింది.

ఇవి చ‌ద‌వండి: 'అమ్మా.. ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను.. నీతోనే ఉంటానని' అనంత లోకాలకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement