
మాస్కో: రష్యా–భారత్–చైనా త్రయం బంధాన్ని పునరుద్ధరించాలని రష్యా పిలుపునిచ్చింది. లద్దాఖ్లో సైనిక ప్రతిష్టంభనకు సంబంధించి భారత్, చైనా అవగాహనకు వచ్చిన నేపథ్యంలో మూడు దేశాలూ మరింతగా కలసి సాగాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. ‘‘రష్యా–భారత్–చైనా (ఆర్ఐసీ) కార్యకలాపాల పునరుద్ధరణపై మేం ఆ సక్తిగా ఉన్నాం. రష్యా మాజీ ప్రధాని యెవగనీ ప్రిమ కోవ్ చొరవతో చాలా ఏళ్ల క్రితం స్థాపించిన ఆర్ఐసీ పునరుద్ధరణ కోసం వేచి చూస్తున్నాం.
వాటి మధ్య గతంలో ఏకంగా 20సార్లకు మించి అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి. సరిహద్దులో పరిస్థితిని సుల భతరం చేయడంపై భారత్, చైనా మధ్య అవగా హన కుదిరింది. కనుక ఆర్ఐసీ పునరుద్ధరణకు ఇదే సరైన సమయం’’ అని లావ్రోవ్ అన్నారు. పెర్మ్లో జరిగిన అంతర్జాతీయ సామాజిక, రాజకీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ను చైనా వ్యతి రేక కుట్రలోకి లాగేందుకు నాటో ప్రయ త్నిస్తోందని ఆరోపించారు. 2020 జూన్లో గల్వాన్ సంక్షోభం అనంతరం ఆర్ఐసీ కార్యకలాపాలు నిలిచిపోయాయి.