భారత్‌తో చర్చలకు సిద్ధమే: షెహబాజ్‌ | Sakshi
Sakshi News home page

భారత్‌తో చర్చలకు సిద్ధమే: షెహబాజ్‌

Published Wed, Aug 2 2023 1:35 AM

Pakistan Ready To Talk With India Says Pakistan PM Shehbaz Sharif - Sakshi

ఇస్లామాబాద్‌: భారత్, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వెల్లడించారు. ఇరు దేశాల్లో పేదరికం, నిరుద్యోగంతో పోరాడుతున్న నేపథ్యంలో యుద్ధం అనేది మార్గం కాదన్నారు. పాకిస్తాన్‌ మినరల్స్‌ సమ్మిట్‌ సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమంలో షెహబాజ్‌ పాల్గొన్నారు..

ఆర్థికంగా కుదేలైన దేశంలో విదేశీ పెట్టుబడుల కోసం ఉద్దేశించిన ఈ సదస్సులో హెహబాజ్‌ మాట్లాడుతూ పాకిస్తాన్‌ కోలుకోవడం కోసం ఇరుగు పొరుగు దేశలన్నింటితోనూ తాము మాట్లాడతామని, పొరుగు దేశంతో యుద్ధం అనేది ఇక మార్గం కాదన్నారు. భారత్‌తో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కశ్మీర్‌ అంశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రేరేపిస్తూ ఉండడంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
Advertisement