భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారు | Iran lists India as place where Muslims suffer | Sakshi
Sakshi News home page

భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారు

Sep 17 2024 5:42 AM | Updated on Sep 17 2024 5:42 AM

Iran lists India as place where Muslims suffer

ఇరాన్‌ సుప్రీం నేత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్‌

సొంత రికార్డు చూసుకోవాలంటూ హితవు
 

టెహ్రాన్‌/న్యూఢిల్లీ: మహ్మద్‌ ప్రవక్త జయంతి సందర్భంగా ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ సోమవారం చేసిన ప్రకటనపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు వేదనను అనుభవిస్తున్నారు. మయన్మార్, గాజా, భారత్‌..తదితర ఏప్రాంతంలోనైనా ముస్లింలు పడుతున్న బాధలను పట్టించుకోకుంటే మనం ముస్లింలమే కాదు’అంటూ ఖమేనీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. 

భారత్‌లోని మైనారిటీ వర్గాన్ని గురించి ఇరాన్‌ సుప్రీం నేత చేసిన ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తప్పుడు సమాచారంతో చేసిన ఈ ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లోని మైనారిటీల గురించి వ్యాఖ్యలు చేసే ముందు సొంత మానవ హక్కుల రికార్డును పరిశీలించుకోవాలని ఇరాన్‌కు హితవు పలికింది. ప్రభుత్వ ఉత్తర్వులను తోసిరాజని ఇరాన్‌లో వేలాదిగా మహిళలు హిజాబ్‌ లేకుండా వీధుల్లోకి వచ్చిన రోజే ఖమేనీ భారత్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
    

Advertisement
 
Advertisement
Advertisement