unacceptable
-
ఇరాన్ దాడి అమానుషం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు పొరుగు దేశాలకు పాకుతున్నాయి. తాజాగా యూఏఈలోని కీలకమైన ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్పై ఇరాన్ చేసిన దాడి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన తొలి భారీ దాడి ఇదే. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆమోదయోగ్యం కాదు: ప్రధాని మోదీసామాన్య పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో యూఏఈకి భారత్ పూర్తి అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. దౌత్యం, పరస్పర చర్చల ద్వారానే అన్ని సమస్యలకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ఇరాన్ తన దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి హార్ముజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛా వాణిజ్యానికి సహకరించాలని కోరింది.డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్ఫుజైరాపై ఇరాన్ ప్రయోగించిన 15 క్షిపణులు, నాలుగు డ్రోన్లను తమ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఒక డ్రోన్ అక్కడి చమురు కేంద్రంపై పడటంతో మంటలు చెలరేగి, అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. బ్రిటన్కు చెందిన రెండు కార్గో నౌకలు సైతం ఈ దాడుల వల్ల మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దాడిపై ఇరాన్ నేరుగా స్పందించకపోయినా.. అమెరికా, యూఏఈలు అకారణంగా బురదలో కూరుకుపోవద్దని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించారు. Our statement on the attack on Fujairah ⬇️🔗 https://t.co/01Nz7g06FR pic.twitter.com/KQAr8R9ciQ— Randhir Jaiswal (@MEAIndia) May 5, 2026హార్ముజ్ జలసంధిలో రగులుతున్న అగ్నిజ్వాలలుప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్ తీరుతో గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు మండిపోతున్నాయి. అక్కడ చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలకు రక్షణగా తమ బలగాలను పంపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. ఇప్పుడు జరుగుతున్న ఈ తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి పూర్తిస్థాయి యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భారత్లో ముస్లింలు బాధలు పడుతున్నారు
టెహ్రాన్/న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ సోమవారం చేసిన ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు వేదనను అనుభవిస్తున్నారు. మయన్మార్, గాజా, భారత్..తదితర ఏప్రాంతంలోనైనా ముస్లింలు పడుతున్న బాధలను పట్టించుకోకుంటే మనం ముస్లింలమే కాదు’అంటూ ఖమేనీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్లోని మైనారిటీ వర్గాన్ని గురించి ఇరాన్ సుప్రీం నేత చేసిన ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తప్పుడు సమాచారంతో చేసిన ఈ ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లోని మైనారిటీల గురించి వ్యాఖ్యలు చేసే ముందు సొంత మానవ హక్కుల రికార్డును పరిశీలించుకోవాలని ఇరాన్కు హితవు పలికింది. ప్రభుత్వ ఉత్తర్వులను తోసిరాజని ఇరాన్లో వేలాదిగా మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లోకి వచ్చిన రోజే ఖమేనీ భారత్పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి
చెన్నై: భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. పాకిస్థాన్ క్రికెటర్ల సమక్షంలో అభిమానుల ప్రవర్తన ఎంత మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు. క్రీడలు దేశాన్ని ఐక్యమత్యం చేయడానికి ఉపయోగపడాలి కానీ.. ద్వేషం వ్యాప్తి చెందడానికి సాధనంగా వాడకూడదని చెప్పారు. శనివారం గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ డ్రెస్సింగ్ రూంకు వస్తున్న క్రమంలో అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీటిపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సోషల్ మీడియాలో అభిమానుల ప్రవర్తనపై భిన్నరకాల స్పందనలు వచ్చాయి. అభిమానుల అర్ధం లేని వ్యూహంగా కొందరు కామెంట్ పెట్టారు. మరో పది రోజుల్లో చెన్నైలో పాక్ క్రీడాకారులు రెండు మ్యాచ్లు అడటానికి వస్తారు. వారందరిని గౌరవంగా స్వాగతించండి అంటూ మరికొందరు స్పందించారు. చెన్నైలో పిచ్ వారికి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న గుజరాత్లో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ను భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లోనే బాబార్ ఆజాంకు కోహ్లీ ఆరుదైన బహుమతి కూడా అందించాడు. తన సంతకం చేసిన జెర్సీని కానుకగా పంపించి సోదరభావాన్ని చాటుకున్నాడు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా మహ్మద్ షమీ బౌలింగ్ వేసే క్రమంలో అభిమానులు జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేయడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇదీ చదవండి: Udayanidhi Stalin: సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు -
ఇది ఆమోదయోగ్యం కాదు! బలవంతపు ఏకపక్షవాదం!
కోల్కతా: కపిల్ సిబల్ ఇటీవల పార్లమెంట్ హౌస్లో ఎంపీలు ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదంటూ జారీ చేసిన ఉత్తర్వులను ఖండిస్తూ...ఇది ఆమోదయోగ్యం కాదన్నారు . బీజేపీ పాలనలో దేశం సహకార సమాఖ్య విధానం నుంచి బలవంతపు ఏకపక్షవాదానికి మారిందని కాంగ్రెస్ మాజీ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు. స్వతంత్ర రాజ్య సభ ఎంపీ కపిల్ సిబల్ దేశంలో సమాఖ్య నిర్మాణం తగ్గిపోయిందని, కేవలం అధికారమే కనిపిస్తోందన్నారు. అధికారం కోసం రాజ్యాంగాన్ని పాడు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, డిమాండ్లను తెలిపే ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చిందన్నారు. చర్చలు ప్రకక్రియ పూర్తిగా లేదని, తాము సహకార ఫెడరలిజం నుంచి బలవంతపు ఏకపక్షవాదానికి మారాం అని కపిల్ సిబల్ వ్యాఖ్యనించారు. అంతేకాదు గవర్నర్ కార్యాలయాలు, కేంద్ర ఏజెన్సీలు దీర్ఘకాలిక ప్రభుత్వాలుగా మారాయి. పార్లమెంట్లో నిరసనలు నిషేధించడాన్ని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిరసనలు ఆపాలని అడిగే రోజు కూడా వస్తుందంటూ గట్టి కౌంటరిచ్చారు. రాజ్యసభ సెక్రటేరియట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం..పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శనలు, ధర్నాలు, మతపరమైన వేడుకలు నిర్వహించరాదు. ఈ విషయమై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చాలా కాలంగా నోటీసులు జారీ చేస్తునే ఉన్నారు. దీంతో విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. (చదవండి: బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు!) -
'హైదరాబాద్పై ఆంక్షలు పెడితే అంతర్యుద్ధం తప్పదు'
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నగరంపైన చిక్కుముడి పెడితే సహించేది లేదని నగర కాంగ్రెస్ నేత, ఖాదీ బోర్డు ఛైర్మన్ నిరంజన్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... హైదరాబాద్పై ఆంక్షలు పెడితే అంతర్యుద్ధం తప్పదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ను కేంద్రం పాలిత ప్రాంత చేయడమన్నా, గవర్నర్ పరిధిలోకి తీసుకురావడమన్నా నగర వాసుల హక్కులు కాలరాయడమేనని నిరంజన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీ తరహాలో చేయాలని సీమాంధ్రకు చెందని కేంద్ర మంత్రుల బృందం శనివారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో గోవర్థన్ పైవిధంగా స్పందించారు.


