కొనసాగుతున్న ఇరాన్‌ దాడులు | Bahrain says Iran launched drone attacks on its territory | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఇరాన్‌ దాడులు

Jun 28 2026 2:40 AM | Updated on Jun 28 2026 4:43 AM

 Bahrain says Iran launched drone attacks on its territory

మనామా: బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ శనివారం పలుసార్లు డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడి తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, పశ్చిమాసియాలో శాంతిని కాపాడే ప్రయత్నాలకు ముప్పు తెచ్చిందని బహ్రెయిన్ ఆరోపించింది.

పశ్చిమాసియాలో ఇటీవల జరిగిన ఘర్షణలకు ముగింపు పలికే ఉద్దేశంతో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత.. అమెరికా-ఇరాన్ తొలిసారి పరస్పరం సైనిక దాడులు చేసుకున్న కొన్ని గంటలకే బహ్రెయిన్‌లో ఈ డ్రోన్ దాడి జరిగినట్టు సమాచారం.

ఇరాన్‌కు చెందిన పలువురు డ్రోన్లు దాడి చేశాయని పేర్కొంటూ బహ్రెయిన్ విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన బహ్రెయిన్ సార్వభౌమాధికారంపై బహిరంగ ఉల్లంఘన అని పేర్కొంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడే ప్రయత్నాలను ఇరాన్‌ దెబ్బతీస్తోందని ఆరోపించింది.

బహ్రెయిన్ చేసిన ఆరోపణలపై టెహ్రాన్ ఇప్పటి వరకూ బహిరంగంగా స్పందించలేదు. అయితే, ఇరాన్ ప్రభుత్వం మాత్రం అమెరికాపై కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసిన తర్వాత, ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు జరిపిందని తెలిపింది.

బహ్రెయిన్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భంగపరచాలనే ఉద్దేశంతోనే ఈ డ్రోన్ దాడి జరిగింది. తాజా పరిణామాలు ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్నాయని సూచిస్తున్నాయి.

అమెరికా, ఇరాన్‌ మధ్య నేరుగా జరిగిన కాల్పులు, కొనసాగుతున్న ఘర్షణల కారణంగా శాంతి ఒప్పంద ప్రయత్నాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.  ఇదే సమయంలో ప్రాంతీయ భద్రతపై మరో ఆందోళన తలెత్తింది. హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య చమురు నౌకను శనివారం ఓ క్షిపణి తాకినట్టు యునైటెడ్ కింగ్‌డమ్ సముద్ర వాణిజ్య కార్యకలాపాల సంస్థ తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement