బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు | Banjara Hills Police Registered Case Against BRS MP Ranjith Reddy - Sakshi
Sakshi News home page

BRS MP Ranjith Reddy: బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు

Published Wed, Jan 24 2024 6:54 AM

- - Sakshi

హైదరాబాద్: బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిని ఫోన్‌లో బెదిరింపు ధోరణితో మాట్లాడిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 20న విశ్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఉండగా ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్‌ చేశారు.

తమ పార్టీ సర్పంచ్‌తో ఎందుకు మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించారు. అంతే కాకుండా దుర్భాషలాడటంతో పాటు తీవ్ర స్థాయిలో బెదిరించారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జీడీ ఎంట్రీ చేసి న్యాయ సలహా నిమిత్తం ఫిర్యాదు కాపీని కోర్టుకు పంపించారు. కోర్టు సూచనమేరకు ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement