-
Chevella Lok Sabha: చేవెళ్ల బరిలో ముగ్గురు ఉద్దండులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: లోక్సభ స్థానాలకు ఏ క్షణమైనా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉండటంతో ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు అటు రాజకీయ పారీ్టలు కూడా సన్నద్ధమయ్యాయి. జిల్లాలోని కీలకమైన చేవెళ్ల స్థానంపై అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ దృష్టి సారించాయి. సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డినే మళ్లీ బరిలోకి దించనున్నట్లు ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన పేరే దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి రోజుకో కొత్త అభ్యర్థి తెరపైకి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. సీఎం రేవంత్రెడ్డికి ఆయనకు మధ్య కొంత అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఆయనకు ఈ స్థానం దక్కకపోవచ్చనే చర్చ నడుస్తోంది. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి రెండు రోజుల క్రితం కారు దిగి హస్తం పారీ్టలో చేరడంతో ఆమెకే అవకాశం ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది. మూడు పారీ్టల నుంచి ముగ్గురు ఉద్దండులు బరిలోకి దిగనుండడంతో ఈసారి చేవెళ్ల పోరు రసవత్తరంగా మారనుంది. క్షేత్రస్థాయిలో ఆశావహులు చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. షాద్నగర్, కొడంగల్ నియోజకవర్గాలు మహబూబ్నగర్ పరిధిలో ఉండగా, కల్వకుర్తి నియోజకవర్గం నాగర్కర్నూల్ పరిధిలో కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం భువనగిరి పరిధిలో, ఎల్బీనగర్ నియోజకవర్గం మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో కొనసాగుతున్నాయి. 2019లో ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 12,70,687 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ జి.రంజిత్రెడ్డికి 5,16,363 ఓట్లు (40.64 శాతం) రాగా, కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి 5,0,318 ఓట్లు (39. 61శాతం)వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బి.జనార్దన్రెడ్డికి 1,95,919 ఓట్లు (15.42 శాతం) వచ్చాయి. బీఎస్పీ సహా ఇతర పారీ్టలకు డిపాజిట్ దక్కలేదు. పోటీలో ఉన్న 20 మందికి నోటా (9,045) కంటే తక్కువ ఓట్లు పోలవడం గమనార్హం. 2024 ఫిబ్రవరి 8 నాటికి ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 29,14,124 మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. వీరిలో 14,93,369 మంది పురుషులు, 14,20,469 మంది మహిళలు ఉన్నారు. మరో 286 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా తలపడనున్నారు. ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించే నేతలంతా ఆర్థికంగా బలవంతులు కావడంతో ఎన్నికల కోసం భారీగా ఖర్చుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వీరంతా క్షేత్రస్థాయిలో పర్యటించడంతోపాటు ఇతర పారీ్టల్లో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు వల వేస్తున్నారు. వీరికి భవిష్యత్తులో పలు రాజకీయ పదవులతో పాటు నగదు, ఖరీదైన వాహనాలు ఎరగా చూపుతున్నట్లు తెలిసింది. తుది ఓటరు జాబితా వెల్లడి లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు జాతీయ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎప్పుడు ఎన్నికలు వచి్చనా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎన్నికల కమిషన్ తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఈ నెల 8న జాబితా విడుదల చేసింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 3,369 పోలింగ్ స్టేషన్లు ఉండగా, వీటి పరిధిలో 35,91,987 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వీరిలో 18,50,292 మంది పురుషులు, 17,40,379 మంది మహిళలు ఉన్నారు. 449 మంది థర్డ్జెండర్లు ఉన్నారు. వీరితో పాటు 286 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, మరో 581 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. వికారాబాద్ జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 9,84,068 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 4,86,109 మంది పురుషులు, 4,97,920 మంది మహిళలు ఉన్నారు. మరో 39 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. -
బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్: బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఫోన్లో బెదిరింపు ధోరణితో మాట్లాడిన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 20న విశ్వేశ్వర్రెడ్డి బంజారాహిల్స్లోని తన నివాసంలో ఉండగా ఎంపీ రంజిత్రెడ్డి ఫోన్ చేశారు. తమ పార్టీ సర్పంచ్తో ఎందుకు మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించారు. అంతే కాకుండా దుర్భాషలాడటంతో పాటు తీవ్ర స్థాయిలో బెదిరించారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై కొండా విశ్వేశ్వర్రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జీడీ ఎంట్రీ చేసి న్యాయ సలహా నిమిత్తం ఫిర్యాదు కాపీని కోర్టుకు పంపించారు. కోర్టు సూచనమేరకు ఎంపీ రంజిత్రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆయనో పెద్ద కబ్జాకోరు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘రంజిత్రెడ్డి ఓ పెద్ద కబ్జాకోరు. ఆయన ఫిలింనగర్లోని దేవాలయ భూమిని ఆక్రమించాడు. ఆయనపై కోళ్ల దాణా, గుడ్ల కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. గోపన్పల్లి, నానక్రాంగూడలోనూ విలువైన స్థలాలను కొల్లగొట్టాడు. కేటీఆర్కు ఆయన ఓ బినామీ. ఐదేళ్లలో ఆయన చేవెళ్లకు చేసిందేమీ లేదు’ అని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆరోపించారు. నగరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ నేతలు రవికుమార్ యాదవ్, తోకల శ్రీనివాసరెడ్డితో కలిసి మాట్లాడారు. ఎంపీగా ఆయన ధ్యాసంతా సంపాదనపైనే ఉందన్నారు. లోక్సభలో ఏనాడూ చేవెళ్ల ప్రజల కష్టాలను ప్రస్తావించలేదన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని, ఏ ఒక్క రోడ్డునూ వేయించలేక పోయారని విమర్శించారు. సొంత ఫాంహౌస్కు ప్రభుత్వ నిధులతో రోడ్డును వేయించుకున్నారని, ప్రస్తుతం ఈ ఫాంహౌస్ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలోని పెద్దలను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని, పద్ధతి మార్చు కోకపోతే.. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించాడని, బేషరతుగా ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల ముందు హడావుడిగా రంగారెడ్డి–పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించారని, పనులు పూర్తి కాక ముందే ప్రారంభించి రైతులను మోసం చేశారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదన్నారు. 111 జీఓ రద్దు చేసినట్లు ప్రకటించినా.. ఇప్పటికీ కోర్టుల్లో కేసు పెండింగ్లోనే ఉందన్నారు. శంకర్పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూంల పంపిణీలో స్థానికులకు తీరని అన్యాయం జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. చేవెళ్లను మున్సిపాలిటీ చేస్తున్నట్లు ప్రకటించి, ప్రజలను తప్పుదోవ పట్టించాడని ధ్వజమెత్తారు. పరిశ్రమల పేరుతో పెద్ద ఎత్తున పేదల భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వస్తారని ప్రశ్నించారు. -
ఎంపీ రంజిత్రెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోలీసు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజీత్రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇద్దరు నేతలు ఫోన్ సంభాషణలో దుర్భాషలాడుకున్నారు. తన మనుషులను ఎలా కలుస్తారని కొండాకు ఫోన్ చేసి ఎంపీ రంజిత్ ప్రశ్నించారు. దీంతో నీకు దమ్ము ధైర్యం ఉంటే నా వాళ్లను తీసుకువెళ్లు అని కొండా స్పందించారు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో రచ్చకు దారితీసింది. దీంతో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డిపై మాజీ ఎంపీ కోండా విశ్వేశ్వరరెడ్డి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో రంజిత్రెడ్డిపై కొండా కంప్లైంట్ చేశారు. ఎంపీ రంజిత్రెడ్డి ఫోన్లో తనను దూషించాడని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కొండా విశ్వేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్పై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఫిర్యాదు ఎవరు ఫోన్ చేశారో పేరు కూడా చెప్పానని అన్నారు.పెద్దల సలహా మేరకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఫోన్తో దూషిస్తూ, బెదిరింపులకు దిగాడని అన్నారు. రాజకీయ కారణాలు తప్ప తమ మధ్య ఏం లేదని, అతనున బీఆర్ఎస్, తాను బీజేపీ అని అన్నారు. ఫోన్ నెంబర్, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. చదవండి: జనవరి కరెంట్ బిల్లులు కట్టకండి: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ పిలుపు -
చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి..?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ.. చేవెళ్ల పార్లమెంట్ నియోజ కవర్గంలో మాత్రం ఎన్నికల వేడి రాజుకుంది. సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డికే మళ్లీ ఛాన్స్ ఇస్తూ బీఆర్ఎస్ అధిష్టానం ఊహాగానాలకు చెక్పెట్టగా, ఎలాగైనా ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఆశావహులు పోటీపడుతున్నారు. చేవెళ్ల కేంద్రంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నా యి. ఇటీవల మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సహా ఈ అసెంబ్లీ టికెట్ ఆశించి, చివరి నిమిషంలో భంగపడిన పారిజాత నర్సింహారెడ్డి, సీఎం రేవంత్రెడ్డికి అతి సన్నిహితుడైన ఎలుగింటి మధుసూదన్రెడ్డి సహా మరికొంత మంది నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పట్టు సాధించేందుకు యతి్నస్తున్నారు. తనకంటూ ఓ ప్రత్యేక కేడర్ను తయారు చేసుకుని ముందుకెళ్తున్నారు. ఆ ఆంతర్యం ఏమిటో? నియోజకవర్గాల పునరి్వభజనలో భాగంగా చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ పార్లమెంట్ పరిధిలో తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తొలి ఎన్నికల్లో దివంగత సూదిని జైపాల్రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. రెండోసారి పోటీకి ఆ యన ఆసక్తి చూపలేదు. 2014లో ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కారుగుర్తుపై పోటీ చేసిన రంజిత్రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఒకసారి విజయం సాధించిన వారు.. రెండోసారి పోటీకి పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. పోటీ చేసిన వారు ఓటమి పాలయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభా స్థానాలుండగా, ఆ పార్టీ అధిష్టానం కేవలం చేవెళ్ల లోక్సభ స్థానానికే అ భ్యరి్థని ప్రకటించడం వెనుక ఉన్న ఆంత ర్యం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. అనేక సవాళ్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ రంజిత్రెడ్డి వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరించారు. అక్కడ బీఆర్ఎస్ ఓటమి పాలైంది. చేవెళ్ల అభ్యరి్థకి అండదండగా నిలిచినప్పటికీ.. కేవలం 268 ఓట్లతోనే బీఆర్ఎస్ గట్టెక్కింది. రాజేంద్రనగర్ నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించినట్లు అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను పక్కన పెట్టి.. ఆయన సొంతంగా పలు కార్యక్రమాలు చేశారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తన తనయుడికి చేవెళ్ల నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ ఆయన గెలుపునకు కృషి చేస్తారా? అంటే అనుమానమే. దీనికి తోడు శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్లో బీజేపీ బలంగా ఉంది. వికారాబాద్, పరిగి, తాండూరులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఇచి్చన హామీ మేరకు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. గత ప్రభుత్వం జీఓ నంబర్ 111 ఎత్తి వేసినట్లు చెపుతున్నా.. సాంకేతికంగా ఇప్పటికీ జీఓ అమల్లోనే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన మళ్లీ నెగ్గుకొస్తారా? అంటే వేచి చూడాల్సిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్
IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
ఇంట గెలవని రాణి..!
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement