
నిర్మల వాణి
ఒకప్పుడు ఋషులు, మహర్షులు కఠోరమైన తపస్సులు చేస్తేనే కానీ సాధ్యం కాని కుండలినీ శక్తి జాగృతి నేడు సాధారణమైన గృహస్థ జీవితం గడుపుతున్న సామాన్యులకు ఎలా సాధ్యమయిందని అడిగితే శ్రీ మాతాజీ నిర్మలా దేవి ఇలా వివరిస్తారు
‘ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయింది. మొత్తం మానవాళి తమ పరిణామ క్రమంలో తదుపరి దశ అయిన మానవాతీత స్థాయిని చేరుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది. అనాది కాలంగా అరణ్యాలు, పర్వతాలలో తపస్సులు చేసి భగవంతుని కోసం పరితపింmrన ఋషి పుంగవులంతా నేడు సామాన్యులుగా జన్మిం ఆత్మ సాక్షాత్కారం పొందుతున్నారు. వారి పూర్వ జన్మల పుణ్యఫలం నేడు అనుభవిస్తున్నారు. వారి లోపల ఉన్న దానినే వారికి పరిచయం చేశాను కానీ నేను కొత్తగా ఏమీ ఇవ్వడం లేదు‘ అని చెప్పారు.
ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలలో ఉన్న సహజ యోగ సాధకులు వివిధ రకాల వ్యాధులను, అవి ఇంకా భౌతిక శరీరానికి రావడానికి ముందే చైతన్య తరంగాల సహాయంతో సూక్ష్మ శరీరంలోనే వాటిని గుర్తించి, నయం చేసుకోగలుగుతున్నారు. ఈ విధంగా సహజ యోగం మరింతగా వ్యాప్తి చెందితే, మానవులకు ఇక ఆసుపత్రుల అవసరం ఉండదు అనేది సత్యదూరం కాదు.
ఇదీ చదవండి: Dharmakīrti గెలిచేది, నిలిచేది ధర్మమే...సత్యమే!
ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు ‘సహజ యోగం‘ మీద జరిపిన పరిశోధనకి గాను డాక్టరేట్ డిగ్రీలు ప్రదానం చేయడం జరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం వారు దీనిని ఒక ‘ప్రత్యామ్నాయ వైద్యం‘ గా గుర్తించి గౌరవించారు. ఇంకా శ్రీ మాతాజీ నిర్మలాదేవి చెప్పిన పలు విషయాల మీద పరిశోధన జరుగుతుంది. రష్యాలో శాస్త్రవేత్తలు ‘వెగా మెషీన్‘ అనే మెషీన్ ద్వారా సహజ యోగ ధ్యానం చేయటానికి ముందు, ఆ తర్వాత మనిషి శరీరంలో జరుగుతున్న మార్పులను నమోదు చేసి ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించారు. భవిష్యత్తులో సహజ యోగం మరింతగా వ్యాప్తి చెంది, భృగు మహర్షి తెలియజేసిన విధంగా మొత్తం మానవాళి బ్రహ్మానంద అనుభూతిలో ఓలలాడుతుందని ఆశిద్దాం.
– డా. పి. రాకేశ్
( పరమ పూజ్య శ్రీ మాతాజీనిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)