దొరమడుగు.. కనుమరుగు | - | Sakshi
Sakshi News home page

దొరమడుగు.. కనుమరుగు

Dec 27 2025 7:44 AM | Updated on Dec 27 2025 7:44 AM

దొరమడుగు.. కనుమరుగు

దొరమడుగు.. కనుమరుగు

తిమ్మాపురం పచ్చనేతల కబంధ హస్తాల్లో భూమి

ద్వారకాతిరుమల: పచ్చనేతల భూ కబ్జా తారాస్థాయికి చేరింది. దొరమడుగు భూమి 9 ఎకరాల మేర కబ్జా అయ్యిందని బహిరంగంగా చెబుతున్నా, నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. మండలంలోని తిమ్మాపురంలో ఆర్‌ఎస్‌ నెంబర్‌ 220లో 9 ఎకరాల దొరమడుగు పోరంబోకు భూమిని టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు కబ్జా చేశాడని అదే పార్టీకి చెందిన తూంపాటి పద్మవరప్రసాద్‌ ఆరోపించడంతో పాటు, అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ నుంచి గంటా శ్రీనివాసరావు 5 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, మిగిలిన భూమిని తూంపాటి పద్మవరప్రసాద్‌ కబ్జా చేశాడని శ్రీనివాసరావు వర్గీయులు ఆరోపణలు చేస్తున్న విషయం విధితమే. పద్మవరప్రసాద్‌ తాత ఘంటా వెంకయ్య 1961లో ఈ భూమి తనదంటూ నెల్లూరులోని సెటిల్‌మెంట్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు. దీనిపై అప్పటి సెటిల్‌మెంట్‌ కోర్టు ఆర్‌ఎస్‌ నెంబర్‌ 220 లోని 1.90 ఎకరాల భూమి ఘంటా వెంకట్రామయ్యదని, మిగిలిన భూమి దొరమడుగు పోరంబోకని తీర్పు ఇచ్చింది. ఈ దొరమడుగు భూమిలోని సుమారు 5 ఎకరాలను ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ నుంచి కొనుగోలు చేసినట్టు శ్రీనివాసరావు చెబుతున్నాడు. మిగిలిన 4 ఎకరాల పైగా భూమిలో చెరువు తవ్వుతున్నారు.. అది ఎవరి స్వాధీనంలో ఉంది.. వారికి ఉన్న హక్కులేమిటి అని నిగ్గు తేల్చాల్సిన అధికారులు కిమ్మనడం లేదు. రెవిన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement