Mumbai Mayank Sharma Hit By Train At Malad Station While Standing On Platform Edge, Video Viral - Sakshi
Sakshi News home page

Mumbai Local Train Incident: ప్లాట్‌ఫామ్‌పై పిచ్చి చేష్టలు.. లోకల్‌ ట్రైన్‌ ఢీకొనడంతో గాల్లోకి ఎగిరి.. 

Published Sat, Jul 1 2023 8:48 AM

Mumbai Mayank Sharma Hit By Train At Malad Station Video Viral - Sakshi

ముంబై: మనిషి చేసే చిన్న చిన్న తప్పిదాలు వారి ప్రాణాల మీదకు తెస్తాయి. సెకన్ల వ్యవధిలో ప్రాణాలుపోయే పరిస్థితి వస్తుంది. రైలు ఎక్కే సమయంలో దిగే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సోషల్‌ మీడియా కారణంగా రీల్స్‌, వీడియోలు అంటూ కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన రైలు ఓ యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు స్పాట్‌లోనే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై ముగ్గురు కాలేజ్‌ స్టూడెంట్స్‌ కూర్చున్నారు. వారంతా అక్కడే టిఫిన్ తిన్నారు. ఓ కుర్రాడు పైకి లేచి ప్లాట్ ఫామ్ చివరగా వెళ్లి చేతులు కడుక్కున్నాడు. ఇంతలో అతడి ఫ్రెండ్ మయాంక్‌ అనిల్ శర్మ(17) కూడా చేతులు కడుక్కోవడానికి ప్లాట్ ఫామ్ అంచువరకు వెళ్లాడు. మరో స్నేహితుడు తన చేతులు కడుక్కుని వాటర్ బాటిల్‌లోని నీరు తాగి. ఆ తర్వాత బాటిల్‌ని అనిల్‌కు ఇచ్చాడు. అనిల్ తన చేతులు వాష్ చేసుకుంటున్నాడు.

ఇంతలో ప్లాట్‌ఫామ్‌-3పైకి లోకల్‌ ట్రైన్‌ దూసుకొచ్చింది. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్‌ అంచునే ఉన్న మయాంక్‌ను గట్టిగా ఢీకొనడంతో ఒక్కసారిగా గాల్లోకి లేచి కిందపడిపోయాడు. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ఈ క్రమంలో స్పాట్‌లోనే మయాంక్‌ మృతిచెందాడు. మరో స్నేహితుడికి గాయలయ్యాయి. అయితే, ఈ ప్రమాదం జూన్‌ 17వ తేదీన చోటుచేసుకుంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ప్లాట్‌ఫాంలపై జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: హాయ్ అంటూ దగ్గరయ్యాడు.. నమ్మకంతో ఆమె వీడియో కాల్స్‌ చేసి..

Advertisement
Advertisement