రూ.1,814 కోట్ల డ్రగ్స్‌ సీజ్‌ | Gujarat ATS, NCB seize narcotics worth Rs 1814 cr from a factory in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

రూ.1,814 కోట్ల డ్రగ్స్‌ సీజ్‌

Oct 7 2024 5:19 AM | Updated on Oct 7 2024 5:48 AM

Gujarat ATS, NCB seize narcotics worth Rs 1814 cr from a factory in Madhya Pradesh

అహ్మదాబాద్‌/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీ నుంచి రూ.1,814 కోట్ల విలువైన 907 కిలోల మెఫెడ్రిన్‌తోపాటు, ముడి సరుకును, యంత్ర పరికరాలను అధికారులు  స్వా«దీనం చేసుకున్నారు. గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌), ఢిల్లీ నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ)సంయుక్తంగా జరిపిన దాడిలో బగ్రోడా పారిశ్రామిక ఎస్టేట్‌పై శనివారం దాడి జరిపినట్లు అధికారులు తెలిపారు.

 గుజరాత్‌ ఏటీఎస్‌ యూనిట్‌ సారథ్యంలో ఇంతభారీగా డ్రగ్స్‌ పట్టుబడిన ఘటన ఇదే. ఫ్యాక్టరీలో రోజుకు 25 కిలోల మెఫెడ్రిన్‌ తయారవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు 2017లో మహారాష్ట్రలోని అంబోలిలో మెఫెడ్రిన్‌ పట్టుబడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడని అధికారులు వివరించారు. 

అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల కొకైన్‌ లభ్యం 
అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం పోలీసులు చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రూ.5,620 కోట్ల విలువైన 560 కిలోల కొౖకైన్, 40 కిలోల మారిజువానాను సీజ్‌ చేయడం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు క్రమంలోనే తాజాగా కొకైన్‌ పట్టుబడింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తితోపాటు అతడి టయోటా కారును స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడు విదేశాలకు పరారయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement