రూ.500 నోట్లు మళ్లీ రద్దవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే.. | Will Rs 500 note go out of circulation in March 2026 What government said | Sakshi
Sakshi News home page

రూ.500 నోట్లు మళ్లీ రద్దవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే..

Jun 7 2025 4:33 PM | Updated on Jun 7 2025 5:45 PM

Will Rs 500 note go out of circulation in March 2026 What government said

రూ.500 నోట్లు మరోసారి రద్దవుతాయంటూ సోషల్‌ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే వచ్చే ఏడాది నాటికి రూ.500 నోటును రద్దు చేస్తారంటూ వచ్చిన వాదనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు దీనిపై స్పష్టత ఇచ్చింది.

2026 మార్చి నుంచి రూ.500 నోట్లను దశలవారీగా రద్దు చేస్తామని పేర్కొంటూ గత కొన్ని రోజులుగా యూట్యూబ్లో ఓ వీడియో వైరల్ కావడంతో కరెన్సీ నోట్ల భవిష్యత్తుపై భయాందోళనలు మొదలయ్యాయి. క్యాపిటల్ టీవీ అనే ఛానెల్లో అప్లోడ్ చేసిన 12 నిమిషాల నిడివిగల ఈ వీడియో జూన్ 2 నుంచి ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.

ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలపై స్పందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అటువంటి ప్రకటన చేయలేదు. ప్రజలు ఎటువంటి తప్పుడు సమాచారానికి గురికావద్దని భారత ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ సూచించింది. ‘రూ.500 నోట్లను రద్దు చేయలేదు. చట్టబద్ధంగానే ఉన్నాయి. వార్తలను నమ్మి.. షేర్‌ చేసే ముందు అధికారిక సోర్స్‌లను ఎప్పటికప్పుడు సందర్శించి నిర్ధారించుకోండి’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌  ‘ఎక్స్‌’లో పీఐబీ పోస్ట్ పేర్కొంది.

కొత్త రూ.500 నోట్లు ఎప్పుడొచ్చాయంటే..
2016 నవంబర్ లో పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుత నోటు 66 మిమీ x 150 మిమీ కొలతల్లో స్టోన్ గ్రే కలర్ లో ఉంటుంది. దీని వెనుక భాగంలో భారతీయ వారసత్వ ప్రదేశాల థీమ్ కు అనుగుణంగా ఎర్రకోట చిత్రం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement