17న ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అమెరికా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ సంస్థ టెస్లా.. హైదరాబాద్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల 17న హైటెక్ సిటీలో తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించనుంది. మన దేశంలో టెస్లాకిది ఐదో సెంటర్.
కాగా.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఆక్టేవ్ బ్లాక్లో రానున్న ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో 6 సీటింగ్ కెపాసిటీ టెస్లా వై ఎల్ (లాంగ్– వీల్ బేస్) మోడల్ కారును ప్రదర్శించనున్నారు. 88 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, డ్యూయల్ మోటార్ ఏడబ్ల్యూడీ సిస్టమ్ ఫీచర్స్తో ఉన్న ఈ కారు.. 5 సెకన్ల వ్యవధిలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.61.99 లక్షలు. ఇప్పటికే ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరులో కొలువుదీరిన టెస్లా షోరూమ్లు.. తాజాగా భాగ్యనగరానికి రానున్నాయి.


