సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా మార్కెట్లు.. దూసుకెళ్తున్న ‘టాటా’ షేర్లు | Stock Market Today Opening Updates | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా మార్కెట్లు.. దూసుకెళ్తున్న ‘టాటా’ షేర్లు

Feb 28 2024 9:32 AM | Updated on Feb 28 2024 10:21 AM

stock market today opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. మంగళవారం లాభాలతో ముగిసిన బెంచ్‌మార్క్‌ సూచీలు ఈరోజు కూడా స్వల్ప లాభాలతో సెషన్‌ను ప్రారంభించాయి. 

ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభ సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 16.65 పాయింట్లు లేదా 0.023 శాతం స్వల్ప లాభంతో 73,111.87 వద్ద కొనసాగుతోంది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ స్వల్పంగా 11.00 పాయింట్లు లేదా 0.050 శాతం ఎగిసి 22,209.35 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది.

భారతీ ఎయిర్‌టెల్‌, టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, టాటా మోటర్స్‌, హిందాల్కో షేర్లు మంచి లాభాలతో టాప్‌ గెయినర్స్‌ జాబితాలో చేరాయి. హీరో మోటర్‌కార్ప్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, దివిస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టాలతో టాప్‌ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement