
దేశీయ స్టాక్మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల్లోకి దూసుకెళుతోంది. నిఫ్టీ 123 పాయింట్లు పుంజుకుని 21,778 వద్దకు చేరింది. సెన్సెక్స్ 371 పాయింట్లు లాభపడి 72,410 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం, పవర్గ్రిడ్, టాటా మోటార్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు గురువారం సానుకూలంగా కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు బుధవారం రూ.2,926.05 కోట్ల విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.192.01 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)