
దేశీయ స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, మదుపర్లు లాభాల స్వీకరణ వంటి అంశాలు దేశీ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 41 పాయింట్ల స్వల్ప లాభాలతో 65,807 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 19,494 వద్ద ట్రేడవుతున్నాయి.
టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎం అండ్ ఎం, ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్,జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, హీరో మోటో కార్ప్, హిందాల్కో, నెస్లే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
(Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు )
మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి