సాక్షి మనీ మంత్రా: బుల్‌ రన్‌.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ | Stock Market Expert Karunya Rao About Today Shares | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్రా: బుల్‌ రన్‌.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

Jul 13 2023 9:19 AM | Updated on Jul 14 2023 3:51 PM

Stock Market Expert Karunya Rao About Today Shares - Sakshi

భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వెలువడిన గణాంకాలు ఎకానమీకి కొంత ఊరటనిచ్చాయి. దీంతో పాటు పలు దేశీయ టెక్‌ కంపెనీలు క్యూ1 ఫలితాలు మార్కెట్ అంచనాలను మించి నమోదయ్యాయి. గురువారం ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల వైపు పరుగులు పెడుతున్నాయి. 

ఉదయం 9.14గంటల సమయానికి సెన్సెక్స్‌ 273 పాయింట్ల భారీ లాభాలతో 65667 వద్ద నిఫ్టీ 110 లాభంతో 19495 వద్ద కొనసాగుతుంది. మార్కెట్‌ అంచనాలకు మించి ఆర్థిక సంవత్సరం క్యూ1 (తొలి త్రైమాసికం) ఫలితాల విడుదలతో టీసీఎస్‌తో పాటు, టాటా స్టీల్‌ షేర్లు లాభాలతో పరుగులు తీస్తున్నాయి. 

జులై 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ విలీన ప్రక్రియ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కనుమరుగైంది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లన్నీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం అవ్వడంతో.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సంస్థల షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

వీటితో పాటు ఎస్‌బీఐ, బజాజ్‌ ఆటో, బ్రిటానియా, హిందాల్కో షేర్లు సైతం అదే రీతిలో కొనసాగుతున్నాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, యూపీఎల్‌, ఎథేర్‌ మోటార్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, నెస్లే, సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతి సుజికీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement