
ఈ ఏడాది చివరి ట్రేడింగ్ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిన్నమొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన సూచీలు నేడు ఒక్కసారిగా కుప్పకూలాయి.
ఫలితంగా శుక్రవారం ఉదయం 9.25గంటల సమయానికి సెన్సెక్స్ 174 పాయింట్ల నష్టంతో 72236 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 21723 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుంది
టాటా కన్జూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్, టాటా మోటార్స్, మారుతి సుజికీ, సన్ ఫార్మా, ఎథేర్ మోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బీపీసీఎల్, అపోలో హాస్పిటల్స్, కొటక్ మహీంద్రా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, టైటాన్ కంపెనీ, కోల్ ఇండియా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి.