
స్టాక్ బ్రోకర్ నిబంధనల ఉల్లంఘన
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్పై రూ.3 లక్షల జరిమానా విధించింది. స్టాక్ బ్రోకర్ నిబంధనలు అతిక్రమించినందుకు విధించిన జరిమానాను 45 రోజుల్లోగా చెల్లించవలసిందిగా ఆదేశించింది. 2022 ఏప్రిల్ నుంచి 2024 జనవరి కాలంలో సెబీ నిర్దిష్ట పరిశోధన చేపట్టింది.
ఇదీ చదవండి: చమురు సలసల.. రూపాయి డీలా
13 ఎన్ఎస్ఈ ట్రేడింగ్ టెర్మినళ్లు అదీకృత ప్రదేశాల్లో లేనట్లు ఈ సందర్భంగా గుర్తించింది. 13 టెర్మినళ్లకుగాను 5 టెర్మినళ్ల నుంచి లావాదేవీలు నిర్వహించినట్లు సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. 9 బీఎస్ఈ టెర్మినళ్లు సంబంధిత ప్రాంతాల్లో లేవని తెలియజేసింది. లావాదేవీలు 1 టెర్మినల్ నుంచే జరిగినట్లు వెల్లడించింది. నాలుగు ఎన్ఎస్ఈ, 4 బీఎస్ఈ టెర్మినళ్లలో అనుమతించిన వ్యక్తులుకాకుండా ఇతరులు నిర్వహిస్తున్నట్లు సెబీ దర్యాప్తులో గుర్తించింది.