సెబీ వద్ద డీఆర్హెచ్పీ దాఖలు
రూ. 30 వేల కోట్ల ఇష్యూతో రికార్డ్!
ముంబై: ఎన్ఎస్ఈ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. ఐపీవోకు సంబంధించి ముసాయిదా పత్రాలను (డీఆర్హెచ్పీ) సెబీ వద్ద ఎన్ఎస్ఈ బుధవారం దాఖలు చేసింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుత వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో మొత్తం 14.89 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.
ఇష్యూ పరిమాణం రూ.30,000 కోట్లుగా అంచనా. తద్వారా దేశంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టించనుంది. 2024లో రూ.27,870 కోట్లను సమీకరించిన హ్యుందాయ్ ఐపీవో రికార్డును బ్రేక్ చేయనుంది. ఎస్బీఐ ఒక్కటే 24.75 మిలియన్ షేర్లను విక్రయించనుంది. కాగా, ఎన్ఎస్ఈ 2016లో తొలిసారి ఐపీవో కోసం దరఖాస్తు చేయగా.. కో–లొకేషన్ కేసు, పాలపనాపరమైన అంశాలతో ఉపసంహరించుకుంది.


