Sakshi News home page

మంత్రి కేటీఆర్‌కు హార్వర్డ్ వర్సిటీ నుంచి ఆహ్వానం

Published Sun, Oct 15 2023 11:20 AM

Ktr Invited To India Conference At Harvard University - Sakshi

మంత్రి కేటీఆర్‌కు బోస్టన్‌లోని హార్వర్డ్‌ యూనివర్శిటీ ఆహ్వానం పంపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్‌ 21వ సదస్సులో మాట్లాడేందుకు రావాలని పిలుపునిచ్చింది. ‘ఇండియా రైజింగ్‌-బిజినెస్‌, ఎకానమీ, కల్చర్‌’ అనే థీమ్‌పై ఫైర్‌చాట్‌లో కేటీఆర్‌ మాట్లాడనున్నారు. 

హార్వర్డ్‌లోని ఇండియా కాన్ఫరెన్స్‌ అనేది అమెరికాలోని విద్యార్థులు నిర్వహించే అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటి. ఇందులో వెయ్యిమంది విద్యార్థులు, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పొల్గొననున్నారు. 

గతంలో ఎంతో మంది మేధావులు పాల్గొన్న ఈ సదస్సులో పాల్గొనాలనే హార్వర్డ్‌ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానాన్ని అందించింది. హార్వర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఆహ్వానం అందడంపట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు.
 

Advertisement

What’s your opinion

Advertisement