ఎల్‌ఐసీ, ఐవోసీ భారీ డివిడెండ్లు | India receives Rs 8,753 crore in dividends from Indian Oil and LIC | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ, ఐవోసీ భారీ డివిడెండ్లు

Aug 30 2024 2:44 AM | Updated on Aug 30 2024 2:44 AM

India receives Rs 8,753 crore in dividends from Indian Oil and LIC

కేంద్రానికి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ),  ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ)  భారీ డివిడెండ్లను అందించాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అండ్‌ ఎండీ సిద్ధార్థ మొహంతి రూ.3,662.17 కోట్ల డివిడెండ్‌ చెక్కును అందించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల కూడా పాల్గొన్నారు. 

ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఎల్‌ఐసీ రూ.2,441.45 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను అందించింది. తాజాగా అందజేసిన డివిడెండ్‌తో కలిసి 2023–24లో సంస్థ మొత్తం రూ.6,103.62 కోట్ల డివిడెండ్‌ను అందించినట్లైంది.  ఇక ఐవోసీ రూ.5,091 కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి సమరి్పంచింది. 2024–25లో ఇప్పటి వరకూ కేంద్రానికి రూ.10,604.74 కోట్ల డివిడెండ్‌ అందింది. 2023–24లో డివిడెండ్లు రూ.50,000 కోట్లుకాగా, 2024–25లో ఈ విలువ అంచనాలు రూ.56,260 కోట్లు.

Advertisement
 
Advertisement
Advertisement