ఈ–కామర్స్‌ ఎగుమతులకు భారీ అవకాశాలు | India plans to build 50 e-commerce export hubs | Sakshi
Sakshi News home page

ఈ–కామర్స్‌ ఎగుమతులకు భారీ అవకాశాలు

Sep 1 2024 1:49 AM | Updated on Sep 1 2024 1:49 AM

India plans to build 50 e-commerce export hubs

ఆసక్తిగల కంపెనీలతో త్వరలో డీజీఎఫ్‌టీ భేటీ

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారీన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ప్రస్తుతం చైనా నుంచి ఈ–కామర్స్‌ ఎగుమతులు 300 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, భారత్‌నుంచి కేవలం 5 బిలియన్‌ డాలర్లే ఉన్నట్టు వెల్లడించారు. కనుక రానున్న సంవత్సరాల్లో భారత్‌ నుంచి ఈ–కామర్స్‌ ఎగుమతులను 50–100 బిలియన్‌ డాలర్లకు చేర్చే సామర్థ్యాలున్నట్టు వివరించారు. 

టెక్స్‌టైల్స్, హ్యాండ్లూమ్, రత్నాభరణాల వంటి వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులను (ఎఫ్‌ఎంజీ) సమీకరించే సామర్థ్యం ఉన్న కంపెనీలు ఈ–కామర్స్‌ ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. కాకపోతే ఈ ఉత్పత్తులను సమీకరించే చక్కని నెట్‌వర్క్, లాజిస్టిక్స్‌ సదుపాయాలు, గోదాముల వసతులు అవసరమన్నారు. 

ఈ కామర్స్‌ ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహా్వనించగా.. త్వరలో ఆయా కంపెనీలతో డీజీఎఫ్‌టీ సమావేశం కానున్నట్టు చెప్పారు. 4–5 రోజుల్లో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని తెలిపారు.

 ‘‘ఏ అగ్రిగేటర్‌ అయినా లేదా సంస్థ.. ఫాస్ట్‌ మూవింగ్‌ ఈ–కామర్స్‌ గూడ్స్‌ అయిన టెక్స్‌టైల్స్, రత్నాభరణాలు, చేనేత ఉత్పత్తులు, ఆయు‹Ù, వెల్‌నెస్‌ ఉత్పత్తులను డిమాండ్‌కు అనుగుణంగా డెలివరీ చేయగలిగే సామర్థ్యాలు ఉంటే ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు’’అని వివరించారు. ఈ తరహా ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు తగిన సామర్థ్యాలు షిప్‌రాకెట్, డీహెచ్‌ఎల్‌ సంస్థలకు ఉన్నట్టు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement