హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ రూ. 2,597 కోట్ల ఆదాయం ప్రకటించింది. ఎబిటా రూ. 576 కోట్లుగా నమోదైంది. ఆస్టర్ డీఎం హెల్త్కేర్, క్వాలిటీ కేర్ ఇండియా విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రపంచ స్థాయి హెల్త్కేర్ సంస్థలను నిర్మించే దిశగా దాదాపు నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ఇరు కంపెనీల కలయిక ఒక కీలక మైలురాయని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆజాద్ మూపెన్ చెప్పారు. దేశంలోనే టాప్ 3 హాస్పిటల్ చెయిన్స్లో ఒకటిగా నిలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఆస్టర్, కేర్, కిమ్స్ ఇండియా, ఎవర్కేర్కి కలిపి 28 నగరాల వ్యాప్తంగా 10,800 పైగా పడకల నెట్వర్క్ ఉందని, దీన్ని 15,000 పడకల స్థాయికి పెంచుకోనున్నామని చెప్పారు.


