
ఐటీ పరిశ్రమలో ఉద్యోగ కోతలు మరింత పెరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇటీవల దాదాపు 6,700 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఐబీఎం కంపెనీ ఏకంగా 8,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.
ఐబీఎం కంపెనీ తొలగించనున్న ఉద్యోగుల జాబితాలో అధికంగా హెచ్ఆర్ విభాగానికి చెందినవారే (సుమారు 200 మంది) ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని తొలగించడానికి ప్రధాన కారణం.. హెచ్ఆర్ ఉద్యోగుల పనిచేయడానికి కంపెనీ ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టడమే. సమాచారాన్ని సేకరించడం, ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, పేపర్ వర్క్ నిర్వహించడం వంటి పనులను పూర్తి చేయడానికి కంపెనీ ఏఐను అభివృద్ధి చేసింది.
ఏఐ టెక్నాలజీ పనిని మరింత వేగంగాఈ చేయడంతో.. హెచ్ఆర్ ఉద్యోగుల అవసరం దాదాపు అనవసరమని భావించి కంపెనీ లేఆప్స్ ప్రకటించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ విభాగంలో మరింత మంది ఉద్యోగులు.. తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2024 నాటికి ఐబీఎంలో ఉద్యోగుల సంఖ్య 2.8 లక్షలు. అయితే కంపెనీ ఉద్యోగుల తొలగింపు చేపట్టిన తరువాత ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.
ఇదీ చదవండి: ఏఐ ఆటోమేషన్కే ప్రాధాన్యత: నివేదికలో కీలక అంశాలు
సంస్థలో కొన్ని పనులను ఆటోమేట్ చేయడం వల్ల ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వనరులు సమకూరుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ను కొన్ని ఎంటర్ప్రైజ్ వర్క్ఫ్లోలపై ఉపయోగించడం వల్ల కార్యకలాపాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఇతర విభాగాల్లో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు హెచ్ఆర్లోని ప్రస్తుత ఏఐ వ్యవస్థలు అవకాశం కల్పిస్తున్నాయని కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ తెలిపారు.