పసిడి పరుగు నాన్స్టాప్గా కొనసాగుతోంది. వరుసగా నాలుగో సెషన్లోనూ అదే జోరు కొనసాగిస్తూ మరో రూ. 2,700 పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల రేటు రూ. 1,67,100కి చేరింది.
మరోవైపు, మూడు రోజుల ర్యాలీ అనంతరం ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెండి జోరు కాస్త ఆగింది. కేజీ ధర రూ. 3,500 తగ్గి రూ. 2,50,000కి పరిమితమైంది. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లలో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 11.87 డాలర్లు (సుమారు 0.26 శాతం) క్షీణించి 4,639.51 డాలర్లకు, వెండి 1.04 శాతం తగ్గి 67.88 డాలర్లకు దిగి వచ్చాయి.


