
ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల యోచన
గతేడాది లాంజ్ సర్వీసుల్లో అంతరాయమే కారణం
ముంబై: గతేడాది పలు ఎయిర్పోర్టుల్లో కస్టమర్లు లాంజ్ సర్వీసులను పొందడంలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ట్రావెల్, లైఫ్స్టయిల్ సర్వీసుల అగ్రిగేటర్ డ్రీమ్ఫోక్స్తో ఒప్పందం నుంచి తప్పుకోవాలని పలు బ్యాంకులు, కార్డ్ నెట్వర్క్లు భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మాస్టర్కార్డ్ మొదలైనవి ఉన్నాయి.
మరిన్ని బ్యాంకులు వాటి బాటలో నడిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లిస్టెడ్ కంపెనీ అయిన డ్రీమ్ఫోక్స్ దేశీయంగా దిగ్గజ ఎయిర్పోర్ట్ లాంజ్ ఆపరేటర్లలో ఒకటిగా కార్యకలాపాలు సాగిస్తోంది. గతేడాది సెపె్టంబర్ 22న సర్వీసుల్లో అంతరాయం కారణంగా పలు విమానాశ్రయాల్లో లాంజ్ని ఉపయోగించుకోలేక బ్యాంకులు, కార్డ్ నెట్వర్క్లకు చెందిన వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. 34 ఎయిర్పోర్టుల్లోని 49 లాంజ్ సర్వీసులు అకస్మాత్తుగా నిలి్చపోయాయి.