దానిపైనే కంపెనీల ఫోక‌స్‌.. క‌ల‌వర‌పెడుతున్న ఇన్ఫోసిస్ రీసెర్చ్‌!  | APAC businesses to nearly triple spends on GenAI in 2024: Infosys Research | Sakshi
Sakshi News home page

Infosys Research: దానిపైనే కంపెనీల ఫోక‌స్‌.. క‌ల‌వర‌పెడుతున్న ఇన్ఫోసిస్ రీసెర్చ్‌! 

Jan 28 2024 3:44 PM | Updated on Jan 28 2024 4:00 PM

APAC companies to triple spends on GenAI in 2024 Infosys Research - Sakshi

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. మ‌రీ ముఖ్యంగా జ‌న‌రేటివ్ ఏఐపై కంపెనీలు ఫోక‌స్ పెడుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆసియా పసిఫిక్ కంపెనీలు ఉత్పాదక ఏఐ (GenAI)లో పెట్టుబడులను పెంచుతున్నాయి.  

భారత్ స‌హా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, సింగపూర్‌ల‌లో కంపెనీలు 2024లో జ‌న‌రేటివ్ ఏఐపై పెట్టే ఖ‌ర్చు దాదాపు మూడు రెట్లు పెర‌గ‌నుంద‌ని, ఈ ఏడాదిలో ఆయా కంపెనీలు 3.4 బిలియన్ డాలర్లు (రూ.28 వేల కోట్ల‌కు పైగా) ఖర్చు చేయ‌నున్నాయ‌ని దేశీయ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ చేప‌ట్టిన ఓ అధ్య‌య‌నం అంచ‌నా వేస్తోంది.

ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగులకు దెబ్బ మీద దెబ్బ! మళ్లీ ఇంకో ప్రముఖ కంపెనీ..

కాగా జ‌న‌రేటివ్ ఏఐపై ఖ‌ర్చు విష‌యంలో ఉత్తర అమెరికా దేశాల కంటే త‌క్కుగా ఉన్నప్ప‌టికీ ఆసియా ప‌సిఫిక్ దేశాల్లో ఈ సాంకేతిక‌త‌పై ప‌రిశోధ‌న‌లు, అభివృద్ధి అత్యధికంగా ఉన్నట్లు ఇన్ఫోసిస్ ప‌రిశోధన విభాగమైన ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇన్‌స్టిట్యూట్ (IKI) తెలిపింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, భారతదేశం, సింగపూర్ దేశాల్లోని వెయ్యి మందికిపైగా బిజినెస్ లీడ‌ర్లు, ఏఐ ప‌రిశోధ‌కుల‌తో ఇన్ఫోసిస్ ఈ సర్వే చేప‌ట్టింది.

 

జాబ్స్‌పై ప్రభావం ఉంటుందా?
ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలో జ‌న‌రేటివ్ ఏఐపై భారీగా పెట్టుబడి పెడుతున్న దేశాల్లో చైనా అగ్రగామిగా ఉంది.  ఈ ఏడాది చైనా కంపెనీలు ఈ టెక్నాల‌జీపై పెట్టే  ఖ‌ర్చు 160 శాతానికిపైగా పెరిగి 2.1 బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకోనుంది. అయితే దీని ప్ర‌భావం జాబ్స్‌పై క‌చ్చితంగా ఉంటుంద‌న్న ఆందోళ‌న ఉద్యోగులను క‌ల‌వ‌పెడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement