తిరుమల శ్రీ‌వారిని దర్శించుకున్న అనంత్ అంబానీ | Anant Ambani at Tirumala Attends Srivari Suprabhata Seva | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీ‌వారిని దర్శించుకున్న అనంత్ అంబానీ

Jun 28 2026 8:09 AM | Updated on Jun 28 2026 1:55 PM

Anant Ambani at Tirumala Attends Srivari Suprabhata Seva

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ దుర్శించుకున్నారు.  ఆదివారం తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి, దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. అలాగే శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.

అనంత్‌ అంబానీ అంతకుముందు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా  తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు వెల్లడించారు. ఆ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల జీతభత్యాలు కూడా తామే భరిస్తామన్నారు.

ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులను నడిపే 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు చెల్లించడంతో పాటు, తిరుమలలో ఛార్జింగ్‌ స్టేషన్‌ను రిలయన్స్‌ ఏర్పాటు చేయనుంది. గుజరాత్‌లోని వంతారా తహరాలో టీటీడీ గోశాలను ఆధునికీకరించేందుకు అంగీకారం తెలినట్లుగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement