మార్కెట్లో మళ్లీ సానుకూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ వారంలో మూడు ఐపీఓలు ఇన్వెస్టర్ల తలుపు తుడుతున్నాయి. లగ్జరీ క్రూ యిజ్ సర్వీసులను అందిస్తున్న కార్డీలియా క్రూ యిజెస్ పేరెంట్ కంపెనీ వాటర్వేస్ లీజర్ టూరిజమ్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో రూ. 585 కోట్లు సమీకరించనుంది. ఇక జైపూర్కు చెందిన ఆభరణాల తయారీ సంస్థ అద్విత్ జ్యువెల్స్, ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సీఎస్ఎం టెక్నాలజీస్ కూడా జాబితాలో ఉన్నాయి.
వాటర్వేస్ లీజర్ టూరిజం
ఎప్పుడు: జూన్ 23న ప్రారంభం.. 25న ముగింపు
షేరు ధరల శ్రేణి: రూ.769–808
సమీకరణ మొత్తం: రూ.585 కోట్లు
అద్విత్ జ్యువెల్స్
ఎప్పుడు: జూన్ 23న ప్రారంభం.. 25న ముగింపు
షేరు ధరల శ్రేణి: రూ.130–138
సమీకరణ మొత్తం: రూ.165 కోట్లు
సీఎస్ఎం టెక్నాలజీస్
ఎప్పుడు: జూన్ 24న ప్రారంభం.. 29న ముగింపు
షేరు ధరల శ్రేణి: రూ.107–113
సమీకరణ మొత్తం: రూ.146 కోట్లు


