సాక్షి, తాడేపల్లి: సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
గౌరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, నిన్న శుక్రవారం సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తల్లి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.


