రుతుపవనాల్లో కదలిక

Today there are heavy rains on the coast andhra - Sakshi

రెండురోజుల్లో నైరుతి, ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతాల్లోకి విస్తరణ

జూన్‌ 4 కల్లా కేరళలోకి ప్రవేశించే అవకాశం

నేడు కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు

సాక్షి, విశాఖ­పట్నం: నైరుతి రుతు­­పవ­నాల్లో ఎట్టకే­లకు కద­­లిక వస్తోంది. వారం రోజుల కిందట ఈ రుతుపవనాలు అండమాన్‌ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి సకాలంలోనే ప్రవేశించాయి. తర్వాత అవి ఊహించిన దానికంటే నెమ్మ­దిగా కదు­లుతున్నాయి. గురువారం నుంచి అవి చురుకు­దనాన్ని సంతరించుకోనున్నాయి.

ఒకటి, రెండు­­రోజుల్లో ఈ రుతుపవనాలు మాల్దీ­వులు, కొమరిన్‌ ప్రాంతాలతో పాటు నైరుతి, ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతాల్లోని కొన్ని ప్రాంతాలకు, అనంతరం మధ్య, ఆగ్నేయ బంగాళా­ఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థి­తులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతా­వరణశాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి వెల్లడించింది. ఐఎండీ ముందుగా అంచనా వేసినట్టుగా జూన్‌ 4వ తేదీకల్లా నైరుతి రుతుపవ­నాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలు మెరుగుపడ్డా­యని వాతా­వరణ నిపుణులు చెబుతున్నారు.

మరో­వైపు పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మర­ఠ్వాడా, కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొన­సాగు­తోంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో­స్ఫిరిక్‌ స్థాయిలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తు­న్నాయి. ఫలితంగా రానున్న మూడు­రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

బుధ­వారం కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలకు ఆస్కా­రం ఉందని పేర్కొంది. రానున్న మూడు­రో­జులు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదు­రు­గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి, రెండుచోట్ల పిడుగులు పడొచ్చని వివరించింది.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top