
కూటమి పాలనలో వరస ఆలయ అపచారాల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో గేమింగ్ యాప్ వ్యవహారం వెలుగు చూసింది. అందులో ఆలయానికి సంబంధించిన వివరాలు నమోదు కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంపై ఆన్లైన్లో గేమ్ యాప్ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ అనే సంస్థ ఈ యాప్ను రూపొందించింది. వర్చువల్ ఎక్స్పీరియెన్స్తో ఈ యాప్ను డిజైన్ చేసింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలు.. ఇందులో ఆలయ మహ ద్వార ప్రవేశం, దర్శనం, హుండీ తదితర వివరాలు కనిపిస్తున్నాయి.
ఈ గేమింగ్ యాప్పై పలువురు భక్తులు టీటీడీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ తప్పనిసరైంది. ఈ యాప్తో రోబ్లెక్స్ సంస్థ బారీ ఆదాయం సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది.