పింఛన్లు అడ్డుకుని దొంగ ఏడుపు | TDP Leaders Met With AP CS Jawahar Reddy On Pensions Distribution | Sakshi
Sakshi News home page

పింఛన్లు అడ్డుకుని దొంగ ఏడుపు

Apr 2 2024 4:47 AM | Updated on Apr 2 2024 11:23 AM

TDP Leaders Met With AP CS Jawahar Reddy On Pensions Distribution - Sakshi

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని సీఎస్‌ను కోరిన టీడీపీ నేతలు

వలంటీర్ల ద్వారా తాము వద్దనలేదని బాబు బుకాయింపు 

సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా పక్కాగా, ఠంచ­న్‌గా జరుగుతున్న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీని అడ్డుకునే వరకు నిద్రపోని టీడీపీ నాయ­కులు ఇప్పు­డు మొసలి కన్నీళ్లు కారుస్తుండటంపై లబ్ధి­దారులు తీవ్రంగా మండిపడుతు­న్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వలంటీర్లు ప్రతి నెలా 1న ఇంటివద్దే పెన్షన్లు అందిస్తుం­డటాన్ని సహించలేని చంద్ర­బాబు దొడ్డిదా­రిన అడ్డుకున్నారు.

రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ నేతృత్వంలోని సిటిజన్‌ ఫర్‌ డెమో­క్రసీ సంస్థ ద్వారా వలంటీర్లపై వరుసగా ఫిర్యా­దులు చేశారు. దీంతో కోడ్‌ ముగి­సేవరకు వలంటీర్లను ఈ ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్‌ ఆదే­శి­ంచడం­తో ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి అవాంతరా­లు ఎదుర­య్యాయి. కానీ, ప్రజా­గ్రహంతో ఉలిక్కి­పడ్డ టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, కన్నా లక్ష్మీనారా­యణ, దేవినేని ఉమా తదితరులు ఇంటివద్దే పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.

ఐదో తేదీ లోపు పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలని వినతిపత్రం సమర్పించారు. వలంటీర్లు అర్థరాత్రి ఇళ్లకు వెళ్లి తలుపులు తడుతున్నారంటూ గతంలో ఇష్టానుసారంగా ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకపోవడం వెనుక వైఎస్సార్‌సీపీ కుట్ర దాగి ఉందంటూ ఎదురుదాడికి దిగారు. వలంటీర్లతో పింఛన్ల పంపిణీ చేపట్టవద్దంటూ తాము ఎవరినీ కోరలేదంటూ తనకు అలవాటైన రీతిలో బుకాయించారు. టీడీపీ బూత్‌ కన్వీనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలే విస్తుపోయారు. పింఛన్లు అందకపోవటానికి సీఎం జగనే కారణమని ప్రచారం చేయాలని చంద్రబాబు వారికి సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement