
కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలూరులో జరిగిన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. చంద్రబాబు పుట్టిన రోజులో భాగంగా మండుటెండలో టీడీపీ ర్యాలీ నిర్వహించింది.
అయితే ర్యాలీలో టీడీపీ జిల్లా యూత్ అధికార ప్రతినిధి బోయ సురేంద్ర సొమ్ముసిల్లి పడిపోయారు. అయితే హుటూహుటీనా ఆలూరు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. బోయ సురేంద్ర అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.