తిరుమల: తిరుమలలో మరోసారి రీల్స్ వ్యవహారం చర్చనీయాంశమైంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఓ జంట దేవుడి పేరుతో రీల్స్ చేశారు. సర్వదర్శనం క్యూలైన్ పాటు రాంబగీచా ప్రాంతంలోనూ చేసిన రీల్స్ సోమవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.
తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దర్శనానికి వస్తూ రీల్స్ చేయడంపై ప్రశ్నలు సంధించారు. భక్తి పేరుతో ప్రచారం కోసం ఇలాంటి వీడియోలు చేయడం సరికాదంటూ పలువురు అభిప్రాయపడ్డారు. తిరుమలలో తరచూ ఇలాంటి రీల్స్ వెలుగులోకి వస్తుండడంపై చర్చ జరుగుతోంది. కొంతమంది కావాలనే ప్రచారం కోసం, వార్తల్లో నిలిచేందుకు రీల్స్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


