ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి మరో 11మంది పోలీసులు బలి | More Policemen Affected by the Red Book Constitution in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి మరో 11మంది పోలీసులు బలి

Apr 13 2025 12:04 PM | Updated on Apr 13 2025 1:15 PM

More Policemen Affected by the Red Book Constitution in Andhra Pradesh

గుంటూరు,సాక్షి: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి మరింత మంది పోలీసులు బలయ్యారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్‌ చేసినా సరే.. ముసుగు వేయలేదంటూ పోలీసులుపై కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ, ఎల్లో మీడియా ఆదేశాలతో పదకొండు మంది పోలీసులపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.   

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను మీడియా ముందు ముసుగు వేసి చూపించినందుకు పోలీస్ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. శనివారం ఎస్పీ ప్రెస్ మీట్ సందర్భంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ప్రెస్ మీట్‌లో హాజరు పరచేందుకు పోలీసులు ప్రయత్నించారు.

అయితే, నేను ముసుగు వేసుకొను అని గోరంట్ల మాధవ్ పోలీసులు తేల్చి చెప్పారు. గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ఎందుకు ప్రెస్ మీట్ ముందు హాజరు పరచలేదని ఎస్పీని ఎల్లో మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.  

గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ప్రెస్‌మీట్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టనందుకు స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ సీతారామయ్యపై ప్రభుత్వం వేటు వేసింది. ఆకస్మితంగా బదిలీ చేసి డీజీపీ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ డీఎస్పీతో పాటు మరో పదిమంది పోలీసుల పైన వేటు పడింది. అరండల్ పేట సీఐ వీరాస్వామితో పాటు ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement