కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. వైసీపీ నేత ఇంటిపై పచ్చమూక దాడి | Kurnool District TDP Goons attack On YSRCP Leader at sangala Village | Sakshi
Sakshi News home page

TDP Goons attack: కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. వైసీపీ నేత ఇంటిపై పచ్చమూక దాడి

Aug 1 2026 11:40 PM | Updated on Aug 1 2026 11:40 PM

Kurnool District TDP Goons attack On YSRCP Leader at sangala Village

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారం మదంతో పచ్చమూకలు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్సార్ సిపీ నేత గిరి ఇంటిపైకి దాడికి తెగబడ్డారు. టీడీపీ నేత నాగరాజు ఈ దాడికి పాల్పడ్డారు. ఏ కారణం లేకుండానే వైసీపీ నేత ఇంటిని ధ్వంసం చేశారు. 

దీంతో వైఎస్సార్ సిపీ నేతను పరామర్శించడానికి ఎమ్మెల్యే విరుపాక్షి అక్కడి చేరుకున్నారు. ఎమ్మెల్యే వీరుపాక్షిపై కూడా  టిడిపి గూండాలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాముడుకి గాయాలయ్యాయి. ఈ ఘటనపై టిడిపి నాయకులపై  ఫిర్యాదు చేస్తే  పోలీసులు చోద్య చూస్తున్నారు.  గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ సీఐ రవిశంకర్ రెడ్డి  ఏకపక్షంగా వ్యవహరించారు. ఇంకా గొడవ సర్దుమనుగు కాక ముందే టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి సంగాల గ్రామానికి బయలుదేరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement