ఏపీ విత్తన క్షేత్రాల భూములపై సర్కార్‌ కన్ను | Chandrababu Government Is Encroaching Upon Agricultural seed farm lands | Sakshi
Sakshi News home page

ఏపీ విత్తన క్షేత్రాల భూములపై సర్కార్‌ కన్ను

Jun 12 2026 5:29 AM | Updated on Jun 12 2026 5:29 AM

Chandrababu Government Is Encroaching Upon Agricultural seed farm lands

చిత్తూరు జిల్లాలో సీడ్‌ ఫామ్‌కు చెందిన 46.69 ఎకరాలు 

సోలార్‌ ప్లాంట్‌కు కేటాయింపు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని భూములను అతి చవగ్గా కార్పొరేట్లకు కట్టబెడుతున్న చంద్రబాబు సర్కారు కన్ను ఇప్పుడు వ్యవసాయ విత్తన క్షేత్రా­ల భూములపై కన్నుపడింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం మహదేవమంగళం గ్రామంలో సుమారు 436 ఎకరాల్లో బహుళ విత్తనోత్పత్తి క్షేత్రం (సీడ్‌ మల్టీప్లికేషన్‌ ఫామ్‌) ఉంది. ఇక్కడ వరి, వేరుశనగ, జొన్న విత్తనాలను ఉత్పత్తి చేస్తుంటారు.

ఈ వ్యవసాయ క్షేత్రానికి చెందిన 46.69 ఎకరాల భూమిని సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మా­ణం కోసం కేటాయిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ ఫామ్‌లో పెద్ద ఎత్తున మట్టి దోపిడీ జరుగుతోంది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు ఎలాంటి అనుమతుల్లేకుండా ఫామ్‌లోని మట్టిని తవ్వి దొడ్డిదారిన అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement