ఆర్‌ఎంపీతో ట్రీట్‌మెంట్‌ చేయించారా? | SIT Inquiry CI Nagaraju | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీతో ట్రీట్‌మెంట్‌ చేయించారా?

Aug 2 2026 9:31 AM | Updated on Aug 2 2026 9:31 AM

SIT Inquiry CI Nagaraju

లబ్బీపేట(విజయవాడ): ఆర్‌ఎంపీతో ట్రీట్‌మెంట్‌ చేయించారా? మృతదేహం వివరాలు స్వర్గపురి రికార్డుల్లో రాయకుండా ఎందుకు ఒత్తిడి చేశారు? సాయికృష్ణ తల్లిని బె­దిరించారా? నీ కొడుకు చనిపోయాడు.. ఫొ­టోకు దండవేసుకో.. అని అన్నారా? ఈ ప్ర­శ్నలన్నింటికీ మాజీ సీఐ నాగరాజు నుంచి మౌనమే సమాధానమైంది. సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో నాగరాజును మూడో రో­జు శనివా­రం సిట్‌ విచారించింది. సుమారు 8 గంటల పాటు ఈ విచారణ సాగింది.

 సిట్‌ అధికా­రులు ఏ ప్రశ్న అడిగినా నాగరాజు తనకేమీ తెలి­యదని, సంబంధం లేదని చెప్పి­నట్లు తెలిసింది. ఇప్పటికే సిట్‌ అధికారులు ఈ కేసులో నిందితులైన కానిస్టేబుళ్లు, నాగరాజు అనుచరుడు, ఆర్‌ఎంపీని విచారించి వివరా­లు రాబట్టారు. ఆ వివరాల ఆధారంగా నాగరాజును సిట్‌ ప్రశ్నిస్తోంది. సాయికృష్ణను అ­దుపులోకి తీసుకోవడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, మృతదేహాన్ని మాయం చేయడం వంటి అంశాలపై ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో రక్తపు మరకలు లేకుండా చేయడంపై సిట్‌ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.

 సాయికృష్ణను ఎవరి ఆదేశాలతో స్టేషన్‌కు తీసుకు వచ్చారని ప్రశ్నించగా, తనకేమీ సంబంధం లేదని నాగరాజు చెప్పినట్లు తెలిసింది. సా­యి­కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొ­న్న అంశాలపై కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. అవేమీ తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. పోలీస్‌ స్టేషన్‌లో సీసీ కెమెరా పుటేజీ ఎందుకు డిలీట్‌ అయిందని ప్రశ్నించగా తనకేమీ తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. మరికొన్ని ప్రశ్నలకు ఆ­యన మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement