-
Simhachalam: దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..’అని సింహాచలం కొండకి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించే సరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.! స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.దేవస్థానం అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజయనగరానికి చెందిన భక్తురాలు తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా మీరే దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో వారంతా ఆగ్రహంతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వినోదోత్సవం. స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన ఉంగరం వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టింపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.టెక్కలికి చెందిన భక్తులను ప్రశి్నస్తున్న స్థానాచార్యులు ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందారు. ఉత్స వం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాను తొలగించారు. చివరికి స్వామి చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. ఎస్.కోట మండలం బొద్దాంకి చెందిన నూతన దంపతులు ఈశ్వరరావు, మాధవి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన మౌళీ, గౌతమి, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యారి్థనులు హిమజ, ప్రత్యూష, లావణ్య, శ్వేత అశ్విని, టెక్కలికి చెందిన అక్కాతమ్ముళ్లు జీవిత, నవీన్కుమార్లను పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకి చెందిన రోజా అనే మహిళ తన కుమార్తె మిక్కి, అల్లుడు కిశోర్, మనవలతో కలిసి సింహగిరికి రాగా వారిని తాళ్లతో బంధించారు. వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమా నం వ్యక్తం చేయడంతో వారంతా వాదనకు దిగారు. నా కూతురుకు, అల్లుడికి నిశి్చతార్థం రోజు పెట్టిన ఉంగరాలు ఇవని, దొంగిలించినవి కాదని స్థానాచార్యులతో రోజా వాదించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ట్రస్ట్బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు సైతం దొంగలుగా పట్టుపట్టారు. తొలుత స్థానాచార్యులను కూడా తాళ్లతోనే బంధించి తీసుకురావడం విశేషం. అదే సమయంలో సింహగిరి వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వినోదోత్సవంలో పాల్గొని.. స్వామిని దర్శించుకున్నారు. -
సింహగిరికి మరో ఘాట్ రోడ్
దొండపర్తి : సింహాచలం భక్తులకు శుభవార్త. కొండపైకి మరో ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాకపోకలకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే రెండు ఘాట్లు అందుబాటులో ఉండగా మరో ఘాట్ రోడ్డు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు పూర్తిచేశారు. సింహాచలం దేవస్థానం పై నుంచి కిందకు దిగేందుకు వీలుగా మరో ఘాట్ రోడ్డును నిర్మించేందుకు యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. పర్వదినాల్లో భక్తుల రాకపోకలు, వాహనాల రద్దీని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఘాట్ రోడ్డు వేసేందుకు సింహాచలం దేవస్థానం అధికారులు రెండు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే తొలి పావంచ నుంచి కొండపైకి ప్రస్తుతం ఉన్న రహదారిని దశావతారం జంక్షన్ నుంచి 2.5 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు వాటి సాధ్యాసాధ్యాలపై వివిధ విభాగాల అధికారులతో కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ మంగళవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రహదారుల సామర్థ్యం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకోబోయే చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్అండ్బీ, పోలీస్, దేవస్థానం, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొని వారి సలహాలు, సూచనలు అందజేశారు. భవిష్యత్తు అవసరాలను, ప్రధానంగా గిరి ప్రదక్షిణ, చందనోత్సవం వంటి పర్వదినాల్లో భక్తులు, వాహనాల రాకపోకలను పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి దేవస్థానం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాల్లో అనుకూలమైన మార్గాన్ని చూపేందుకు, అధ్యయనం చేసేందుకు దేవస్థానం, పోలీసు, ఇంజనీరింగ్, ఆర్ అండ్ బీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో కూడిన కమిటీని నియమిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కమిటీ అధ్యయనం తర్వాత అనుకూలమైన మార్గంలో రహదారిని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు రహదారిని ఏర్పాటు చేయటంతో పాటు సింహాచలం దేవస్థానంపై మౌలిక వసతులను కూడా కల్పించాలని చెప్పారు. 25 నుంచి 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మించబోయే రహదారికి ఆనుకొని కొండపై 5 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు కొండపై బస చేసేందుకు అనువుగా అదనపు వసతి గృహాలు నిర్మించాలని, కాటేజీలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్ విధానంలో దేవస్థానం అవసరాలను తీర్చేలా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కొండపై ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈవోను ఆదేశించారు. సుప్రభాత సేవ, ఆరాధన సమయంలో భక్తులు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని, అన్ని రకాల సౌకర్యాలతో కూడిన సత్రాలను నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, సింహాచలం దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి, ఈఈ శ్రీనివాస రాజు, డీసీపీ ఆనంద్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు ఇలా.. దేవస్థానం నుంచి కిందకు దిగేందుకు రెండు ప్రత్యామ్నాయాలను చూపుతూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొండపై ఉన్న టీవీ టవర్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డులో పాత గోశాల వైపు దిగేలా 6 కిలోమీటర్ల మేర ఒక రోడ్డును ప్రతిపాదించారు. కొండ పై భాగంలోని ఎత్తు రోడ్డు నుంచి 4.5 కిలోమీటర్ల మేర బీఆర్టీఎస్ రహదారిలో దిగేలా కృష్ణాపురం గోశాల(సూర్యనారాయణ దేవాలయం) వైపు మరో రహదారిని దేవస్థానం అధికారులు సూచించారు. తొలిపావంచ నుంచి ప్రస్తుతం ఉన్న రహదారిని దశావతారం జంక్షన్ నుంచి పైవరకు 2.5 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదన చేశారు. -
భక్తజన సంద్రంగా సింహాచలం..గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు.. (ఫొటోలు)
-
సింహాచలం చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో పోటెత్తిన భక్తులు
-
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం (ఫొటోలు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
నేతన్నల ఆప్తబంధువు జగనన్న
బొండాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు అన్యాయం
వైఎస్సార్ సీపీలోనే బీసీలకు ప్రాధాన్యం
సర్నాల గెలుపునకు సమష్టిగా కృషి చేయాలి
ఆ పాపం బాలశౌరిదే
మేం ఓటేశాం
ప్రమాదంలో ముస్లిం సమాజం
తప్పక చదవండి
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
Advertisement