సింహాచలంలో ఘోర విషాదం.. చంద్రబాబు సర్కారుపై వీహెచ్‌పీ ఆగ్రహం | Vishwa Hindu Parishad Fire On TDP Government Over Tragedy At Simhachalam Temple, Watch Incident Videos Inside | Sakshi
Sakshi News home page

Simhachalam Tragedy: సింహాచలంలో ఘోర విషాదం.. చంద్రబాబు సర్కారుపై వీహెచ్‌పీ ఆగ్రహం

Apr 30 2025 7:57 AM | Updated on Apr 30 2025 1:27 PM

vishwa hindu parishad fire on tdp government over Tragedy at Simhachalam Temple

విశాఖ,సాక్షి: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు  మృతి చెందారు. ఈ దుర్ఘటనలో చంద్రబాబు సర్కారుపై విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ)ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘సింహాచలంలో సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. నిర్మాణం లోపం వల్లే ఈ ప్రమాదం జరిగింది. సింహాచలంలో పాలన కాదు. లాబీయింగ్‌ నడుస్తోంది. ఎండోమెంట్‌ వ్యవస్థ ఓ చెత్త. భగవంతుడికి భక్తులను దూరం చేయడమే వారి పని. హిందూ మనోభావాలను  తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాలకుల కంబంధ హస్తాల నుంచి ఎండోమెంట్‌ వ్యవస్థ బయటకు వస్తే భక్తులకు మంచి జరుగుతోంది.

నాణ్యతలేని గోడ.. ప్రభుత్వ వైఫల్యం సింహాచలం ఘటనపై VHP నేత ఫైర్

చందనోత్సవంలో ఓ ప్రణాళిక లేదు. ప్లానింగ్‌ లేదు. సింహాచలంలో హిందూ భక్తులకు గౌరవమే లేదు. హుండీలో వేసే  డబ్బు తోటే ఎండో మెంట్‌ వ్యవస్థ నడుస్తోంది. కానీ ఆ భక్తులను పట్టించుకోవడం లేదు. వీఐపీలకు ఇచ్చే ప్రాధాన్యత సామాన్య భక్తులకు లేదు.  హిందూ సాంప్రదాయాలు, సంస్కృతి  తెలిసిన వాళ్లకు మాత్రమే ఎండోమెంట్‌లో ఉండాలి’ అని డిమాండ్‌ చేస్తోంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement