-
మొన్న టిల్లు స్వ్కేర్.. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్
డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్నిషేక్ చేసింది. చాలా రోజుల తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్కు ఓ సాలిడ్ హిట్ అదించాడు టిల్లుగాడు. ఇదే జోష్లో మరో హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటించింది సితార ఎంటర్టైన్మెంట్స్. గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్టయిన చిత్రం ‘మ్యాడ్’చిత్రానికి సీక్వెల్గా ‘మ్యాడ్ స్వ్కేర్’ ని ప్రకటించారు. 'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకరే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె , ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర కూడా 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. -
హారర్... కామెడీ సమానంగా ఉంటాయి: అంజలి
‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా పాయింట్ను కోన వెంకట్గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, ఆ తర్వాత ఈ సినిమాలోని ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా వచ్చింది. హారర్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు హీరోయిన్ అంజలి. ‘గీతాంజలి’కి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్తో కలిసి కోన వెంకట్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’కి ఇది సీక్వెల్ కాబట్టి పాత్రలని మార్చలేదు. కానీ, కొత్త క్యారెక్టర్స్ను (అలీ, సునీల్, సత్య) తీసుకొచ్చాం. రొటీన్గా చేస్తే నటిగా నాకు ఆసక్తి ఉండదు కాబట్టి ప్రతి సినిమాకి కొత్తగా ఉండాలనే చూస్తున్నాను. ఈ ఉగాదికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. -
Ajay Devgn: సీక్వెల్ స్టార్
యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తున్నారు అజయ్ దేవగన్. ఇప్పుడు ఈ హీరోకి ‘సీక్వెల్ స్టార్’ అని ట్యాగ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు... రెండు మూడు కూడా కాదు... ఏకంగా ఎనిమిది చిత్రాల సీక్వెల్స్ అజయ్ దేవగన్ డైరీలో ఉన్నాయి. సీక్వెల్ చిత్రాల్లో నటించడం పెద్ద విషయం కాదు కానీ వరుసగా ఎనిమిది చిత్రాలంటే మాత్రం పెద్ద విషయమే. ఇక అజయ్ సైన్ చేసిన సీక్వెల్ చిత్రాల్లో ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా కొన్ని ఆరంభం కావాలి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. అజయ్ దేవగన్ కెరీర్లో ‘సింగమ్’ చిత్రానిది ప్రత్యేక స్థానం. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీసాఫీసర్ సింగమ్గా అజయ్ దేవగన్ విజృంభించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే ‘సింగమ్’కి సీక్వెల్గా ‘సింగమ్ రిటర్న్స్’ (2014) రూపొంది, సూపర్హిట్గా నిలిచింది. ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైన దాదాపు పదేళ్లకు ఈ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగమ్ ఎగైన్’ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. అజయ్ దేవగన్ హీరోగా ఈ చిత్రానికి కూడా రోహిత్ శెట్టియే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందని సమాచారం. అదే విధంగా అజయ్ దేవగన్ హీరోగా రాజ్కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ‘రైడ్’ (2018) మూవీ ఘనవిజయం సాధించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్గా ‘రైడ్ 2’ తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ హీరోగా డైరెక్టర్ రాజ్కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీ కపూర్, రితేశ్ దేశ్ముఖ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘సింగమ్’ వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘గోల్మాల్’ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే వచ్చిన ‘గోల్మాల్ రిటర్న్స్’ (2008) సూపర్ హిట్ అయింది. ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ‘గోల్మాల్ 3’ (2010), ‘గోల్మాల్ 4’ (2017) కూడా వచ్చాయి. ‘గోల్మాల్ 5’ రానుంది. అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. ఇకపోతే అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో రిలీజై సూపర్ హిట్ అయింది. దాదాపు ఐదేళ్లకి ‘దే దే ప్యార్ దే 2’ సినిమాని ప్రకటించారు మేకర్స్. ఇందులోనూ అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించనున్నారు. అయితే ‘దే దే ప్యార్ దే’కి అకివ్ అలీ దర్శకత్వం వహించగా.. ‘దే దే ప్యార్ దే 2’ మూవీని కొత్త దర్శకుడు అన్షుల్ శర్మ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 2025 మే 1న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ (2010) చిత్రానికి ఇది రీమేక్. ఇక ‘సన్ ఆఫ్ సర్దార్’ వచ్చిన పుష్కరం తర్వాత సీక్వెల్గా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగానికి అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించగా, మలి భాగాన్ని డైరెక్టర్ విజయ్ కుమార్ అరోరా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సెట్స్పైకి వెళ్లనుంది. అలాగే 2025లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా మలయాళ హిట్ మూవీ ‘దృశ్యం’ హిందీ రీమేక్లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ (2015) హిట్గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు ‘దృశ్యం 2’ రిలీజైంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఇదే ఫ్రాంచైజీలో మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్లో కూడా అజయ్ దేవగన్ నటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సైతాన్’ చిత్రం గత నెల 8న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘సైతాన్ 2’ రానుంది. ఇంకా ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ‘ధమాల్’ (2007)తో పాటు ‘డబుల్ ధమాల్’ (2011), ‘టోటల్ ధమాల్’ (2019) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘ధమాల్ 4’ కూడా రానుందని సమాచారం. ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే అజయ్ దేవగన్ ఓ హీరోగా ఈ నాలుగో భాగం ఉంటుందని టాక్. ఇలా వరుసగా సీక్వెల్స్కి సైన్ చేసిన అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మైదాన్’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయన ఫుట్బాల్ కోచ్గా కనిపించనున్నారు. -
హాలీవుడ్లో సీక్వెల్ జోరు
హాలీవుడ్లో సీక్వెల్ అనగానే దాదాపు అందరి దృష్టి ‘అవతార్’ మీద ఉంటుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ తొలి భాగం 2009లో రాగా, రెండో భాగం రావడానికి పదమూడేళ్లు (2022) పట్టింది. మూడు, నాలుగు, ఐదు భాగాలను ప్రకటించారు కామెరూన్. మూడో భాగం ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ‘అవతార్’ అభిమానులను ఇది నిరాశపరిచే విషయమే. అయితే ఈ ఏడాది దాదాపు పది సీక్వెల్స్ రానున్నాయి. పలు హిట్ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న ఆ సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. సమ్మర్లో సైన్స్ ఫిక్షన్ ఈ వేసవికి రానున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’. ‘వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (2017)కి సీక్వెల్గా ఈ చిత్రం రూపొందింది. ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఫ్రాంచైజీలో ఇది నాలుగో భాగం. మూడు భాగాలూ సూపర్ హిట్టయిన నేపథ్యంలో తాజా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వెస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలియమ్ టీగ్, ఫ్రెయా అలన్ తదితరులు నటించారు. మే 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఫుల్ యాక్షన్తో బ్యాడ్ బాయ్స్ జూన్లో బ్యాడ్ బాయ్స్ తెరపైకి రానున్నారు. బడ్డీ కాప్ యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’. 2003లో వచ్చిన ‘బ్యాడ్ బాయ్స్’కి నాలుగో భాగం ఇది. మూడో భాగం ‘బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్’ (2020) విడుదలైన నాలుగేళ్లకు వస్తోన్న సీక్వెల్ ఇది. ఈ చిత్రంలో డిటెక్టివ్ ల్యూటినెంట్ మైఖేల్గా లీడ్ రోల్ని విల్ స్మిత్ చేశారు. రెండో, మూడో భాగానికి దర్శకత్వం వహించిన ఆదిల్, బిలాల్ ద్వయం తాజా చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. నాలుగు భాగాల్లోనూ మైఖేల్ పాత్రను విల్ స్మిత్నే చేశారు. యాక్షన్, కామెడీతో రూపొందిన ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. ఆరేళ్లకు డెడ్పూల్ ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డ సీక్వెల్ చిత్రాల్లో ‘డెడ్పూల్ 3’ది ప్రముఖ స్థానం. ర్యాన్ రేనాల్డ్స్ టైటిల్ రోల్లో షానీ లెవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. మార్వెల్ కామిక్ బుక్స్లోని డెడ్పూల్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందిన తొలి చిత్రం ‘డెడ్పూల్’ (2016). టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ సూపర్ హిట్టయింది. ఈ చిత్రానికి సీక్వెల్గా షానీ లెవీ దర్శకత్వంలో రూపొందిన ‘డెడ్పూల్ 2’ (2018) కూడా బంపర్ హిట్. ఆరేళ్లకు మూడో భాగం ‘డెడ్పూల్ అండ్ వుల్వరిన్’ వస్తోంది. మూడు భాగాల్లోనూ డెడ్పూల్ పాత్రను ర్యాన్ రేనాల్డ్స్ చేశారు. జూలై 26న ఈ చిత్రం రిలీజ్ కానుంది. హారర్ జూయిస్ దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ఫ్యాంటసీ హారర్ కామెడీ మూవీ ‘బీటిల్ జూయిస్’ (1988) సంచలన విజయం సాధించింది. టిమ్ బర్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బీటిల్ జూయిస్ పాత్రను మైఖేల్ కీటన్ పోషించారు. దాదాపు 35 ఏళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్గా టిమ్ బర్టన్ దర్శకత్వంలోనే ‘బీటిల్ జూయిస్ 2’ రూపొందింది. సీక్వెల్లోనూ బీటిల్ జూయిస్ పాత్రను మైఖేల్ కీటన్ చేశారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కానుంది. అక్టోబర్లో జోకర్ అక్టోబర్ నెల రెండు సీక్వెల్స్ని చూపించనుంది. ఒకటి ‘జోకర్’ సీక్వెల్... మరోటి ‘వెనమ్’ సీక్వెల్. అమెరికన్ కామిక్స్ ఆధారంగా మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘జోకర్’ (2019). టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జోకర్ అనే ఆర్థర్ ఫ్లెక్స్ పాత్రను జోక్విన్ ఫీనిక్స్ పోషించారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ‘జోకర్’కి సీక్వెల్గా ‘జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్’ చిత్రం రూపొందింది. అక్టోబర్ 4న ఈ జోకర్ తెరపైకి రానున్నాడు. ఇదే ఆఖరి వెనమ్ కొలంబియా పిక్చర్స్ నిర్మించిన స్పైడర్మేన్ యూనివర్స్లో ఆరో చిత్రం ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్. ‘వెనమ్’ (2018), ‘వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’ (2021) చిత్రాలకు సీక్వెల్ ఇది. ఈ మూడో భాగంతో ‘వెనమ్’ సీక్వెల్ ముగుస్తుందని టాక్. కెల్లీ మార్సెల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వెనమ్ పాత్రను టామ్ హార్డీ పోషించారు. ఈ చిత్రం జూలైలోనే రిలీజ్ కావాల్సింది. అయితే వేతనాల పెంపుకి రచయితలు చేపట్టిన సమ్మె వల్ల వాయిదా పడింది. అక్టోబర్ 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రెండు దశాబ్దాలకు గ్లాడియేటర్ రెండు దశాబ్దాల క్రితం వచ్చిన హిస్టారికల్ డ్రామా ‘గ్లాడియేటర్’ (2000) అనూహ్యమైన విజయం సాధించింది. రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రసెల్ క్రో, జోక్విన్ ఫీనిక్స్ తదితరులు నటించారు. పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు వసూలు చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్గా రిడ్లీ స్కాట్ దర్శకత్వంలోనే రూపొందిన ‘గ్లాడియేటర్ 2’ నవంబర్ 22న రిలీజ్ కానుంది. పౌల్ మెస్కల్, డెంజల్ వాషింగ్టన్ తదితరులు నటించారు. ఈ చిత్రాలతో పాటు యాక్షన్ అడ్వెంచర్ కామెడీ మూవీ ‘సోనిక్ ది హెడ్హాగ్ 3’ డిసెంబర్ 20న, అదే రోజున యానిమేటెడ్ మూవీ ‘హూ ఫ్రేమ్డ్ రాగర్ రాబిట్ 2’, ‘ది కరాటే కిడ్’ ఆరో భాగం డిసెంబర్ 13న... ఇంకా వీటితో పాటు ఈ ఏడాది మరికొన్ని సీక్వెల్స్ వచ్చే చాన్స్ ఉంది. -
కల నిజమైంది
హీరో విశాల్ దర్శకుడిగా మారారు. 2017లో విశాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘తుప్పరివాలన్ ’ (తెలుగులో ‘డిటెక్టివ్’). మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘డిటెక్టివ్ 2’ను ప్లాన్ చేశారు విశాల్. అయితే కొంతకాలం క్రితం క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నారు. దీంతో ‘డిటెక్టివ్ 2’ కోసం విశాల్ దర్శకుడిగా మారారు. ‘‘డైరెక్టర్ కావాలన్న నా కల నిజమైంది. నా దర్శకత్వంలో రానున్న తొలి సినిమా ‘తుప్పరివాలన్ 2’. ఈ సినిమా కోసం లండన్ వెళ్తున్నాను. అజర్బైజాన్ , మల్తా లొకేషన్స్ లో చిత్రీకరణ జరగుతుంది. నా కలను నాకు మరింత చేరువ చేసిన మిస్కిన్ గారికి ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విశాల్. ఇక విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రత్నం’ ఏప్రిల్ 26న విడుదల కానుంది. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నవరతన్ నగలు.. పెట్టుబడికి మార్గం
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement