పిశాచిగా మారతారా?

Andrea Jeremiah to play the lead in the sequel to director Mysskin - Sakshi

తమిళ హీరోయిన్‌ ఆండ్రియా త్వరలోనే పిశాచిగా మారనున్నారట. దర్శకుడు మిస్కిన్‌ తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ తమిళ చిత్రం ‘పిశాచి’. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ సిద్ధం చేస్తున్నారట ఆయన. ఇందులో లీడ్‌ రోల్‌లో ఆండ్రియా నటించనున్నారని సమాచారం. ఆమెది పిశాచి పాత్ర అని కోలీవుడ్‌ టాక్‌. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’లో ఓ కీలక పాత్ర చేశారు ఆండ్రియా. సూర్య హీరోగా ఆరంభం కానున్న ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తారామె.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top