-
telangana: గవర్నర్ కోటా ఎమ్మెల్సీచాన్స్ ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో.. కొత్తగా ఎవరికి చాన్స్ వస్తుందనే దానిపై బీఆర్ఎస్లో చర్చ మొదలైంది. ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న డి.రాజేశ్వర్రావు, ఫారూఖ్ హుస్సేన్ల ఆరేళ్ల పదవీకాలం ఈ నెల 27న పూర్తవుతోంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను గురువారం జరిగే కేబినెట్ భేటీలో ఖరారు చేసే అవకాశముంది. పదవీకాలం పూర్తవుతున్న డి.రాజేశ్వర్రావు, ఫారూఖ్ హుస్సేన్ ఇద్దరూ మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడంతో మరోమారు పదవులను ఆశిస్తున్నారు. క్రిస్టియన్ కోటాలో రాజేశ్వర్, ముస్లిం కోటాలో ఫారూఖ్ హుస్సేన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజేశ్వర్రావు కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు, బీఆర్ఎస్ హయాంలో ఒకసారి.. ఫారూఖ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి ఒక్కోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పనిచేశారు. వారికి మళ్లీ అవకాశమిస్తారా? అన్న దానిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం రెండేళ్ల క్రితం గవర్నర్ కోటాలో పాడి కౌశిక్రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసినా.. ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయనే కారణంతో గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా పక్కనపెట్టారు. దీనితో ప్రభుత్వం ఆ స్థానంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా గవర్నర్ ఓకే చేశారు. ఈ నేపథ్యంలో క్లీన్ ఇమేజీ ఉన్నవారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, టీఎస్పీఎస్సీ చైర్మన్గా సేవలతోపాటు అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటులో చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని చక్రపాణి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇక గౌడ వర్గానికి మండలిలో ప్రాతినిధ్యం లేనందున ఆ వర్గానికి చెందిన ప్రముఖుల పేర్లను.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మైనారిటీ వర్గానికి చెందిన నేతల పేర్లనూ కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. చదవండి: త్వరలో తెలంగాణకు అమిత్షా, జేపీ నడ్డా -
అంబేడ్కర్ వర్సిటీ అకడమిక్ డైరెక్టర్గా ఘంటా చక్రపాణి
బంజారాహిల్స్ (హైదరాబాద్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితు లయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం బోధనేతర సంఘం అధ్యక్షుడు జి.మహేశ్వర్గౌడ్, జనరల్ సెక్రెటరీ మార్కండేయశర్మ, వైస్ప్రెసిడెంట్ ఆర్.భూలక్ష్మి, జాయింట్ సెక్రెటరీ పాండు, కోశాధికారి వెంకట పిచ్చయ్య తదితరులు చక్రపాణిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. -
50 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి అనుమతి
సాక్షి, హైదరాబాద్ : వివిధ ప్రభుత్వ శాఖల్లో 50 వేల ఉద్యోగాల భర్తీకి ఒకేసారి అనుమతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఇదివరకు ఒక్కో శాఖకు ఒక్కోసారి పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చేవారమని, ఇప్పుడు అలాకాకుండా అన్ని శాఖల్లో భర్తీకి ఒకేసారి అనుమతి ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. అతి త్వరలో భర్తీకి అనుమతులు ఇస్తామని, ఇప్పటికే ఖాళీల గుర్తింపుపై కసరత్తు మొదలు పెట్టామన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చం ద్రావతి, ఖాద్రీల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయ న పాల్గొన్నారు. చక్రపాణి, ఇతర సభ్యులను సీ ఎస్ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లలో ఘంటా చక్రపాణి అత్యంత పారదర్శకంగా సేవలందిం చారని సీఎస్ కొనియాడారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెం చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఘం టా చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్రానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, నియామకాల భర్తీ ప్రక్రియలో ఉద్యోగులు ఎంతో సహకరించారని, కమిషన్ పరపతి అంతర్జాతీ య స్థాయిలో పెరిగిందన్నారు. టీఎస్పీఎస్సీలో దరఖాస్తు ప్రక్రియ మొదలు ఫలితాల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక, నియామక ఉత్తర్వులు.. ఇలా అన్ని స్థాయిల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి సత్ఫలితాలు తెచ్చామన్నారు. టీఎస్పీఎస్సీ ఇన్చార్జి చైర్మన్గా కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యుడు డి.కృష్ణారెడ్డి సంస్థ ఇన్చార్జి చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి పదవీకాలం గురువారంతో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
సాంకేతికత.. సంస్కరణలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సాంకేతికంగా పలు సంస్కరణలు తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగడిం చింది. కమిషన్కు తొలి చైర్మన్గా నియుక్తులైన ఘంటా చక్రపాణి ఆరేళ్లలో పలు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలు నియామక పత్రాల జారీ వరకు అన్నింటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పారదర్శకతకు కేరాఫ్ అడ్రస్గా టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దారు. ఈనెల 17న ఘంటా చక్రపాణి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గత ఆరేళ్లలో టీఎస్పీఎస్సీ సాధించిన రికార్డులను పరిశీలిస్తే... అంతా ఆన్లైన్.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడంలో టీఎస్పీఎస్సీ జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగ ప్రకటనలు మొదలు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఫీజు వసూలు, హాల్టికెట్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన.. చివరకు ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నియామక పత్రాన్ని కూడా ఆన్లైన్లో ఇచ్చి టీఎస్పీఎస్సీ తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రత్యేక చర్యల కారణంగా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్లతో ఏర్పాటైన కమిటీకి అధ్యక్షత వహించే అవకాశం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణికి దక్కింది. టీఎస్పీఎస్సీ ప్రవేశపెట్టిన పలురకాల సంస్కరణలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు కావడంలో ఆయన కీలక భూమిక పోషించారు. మారిషస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ డిసిప్లైన్డ్ ఫోర్సెస్ సర్వీస్ కమిషన్ బృందాలు టీఎస్పీఎస్సీని సందర్శించి ఇక్కడి విధానాలను ప్రత్యక్షంగా వీక్షించి పలు అంశాలను తమ దేశంలో అమలుకు ఉపక్రమించడం ద్వారా టీఎస్పీఎస్సీ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎగబాకింది. సీసీటీవీలు, డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించి పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణను సులభతరంగా చేసింది. కమిషన్ తన కార్యకలాపాలన్నీ డిజిటలైజేషన్ చేయడంతో దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ పీఎస్సీగా ఎంపికైంది. కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ)ని అందుబాటులోకి తీసుకొచ్చి పరీక్షల విధానాన్ని మరింత సరళీకృతం చేసింది. పారదర్శకతకు కూడా కమిషన్ పెద్ద పీట వేసింది. టీఎస్పీఎస్సీ కార్యక్రమాలను ఏటా గవర్నర్కు నివేదిక రూపంలో అందజేయడం అనవాయితీగా పాటిస్తున్నారు. అవినీతి లేని వ్యవస్థను నిర్మించాం.. ‘అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేని పారదర్శక వ్యవస్థను నిర్మించగలిగాం. ఇది దేశంలో పీఎస్సీలకు, మారిషస్ లాంటి దేశాలకు మోడల్గా నిలిచింది. వారు మన పద్ధతులను అనుసరించడం గర్వకారణం’అని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. -
కోవిడ్ కాలంలో కొత్త విద్యా వ్యవస్థ
భారతదేశం గురుశిష్యులు ముఖాముఖిగా ఉండి బోధించే పద్ధతికి అలవాటుపడిన దేశం. సమాచారం తెలుసుకోవడానికి టెలివిజన్, సామాజిక మాధ్యమ వేదికలైన వాట్సాప్, ఫేస్బుక్ ఉన్నా చదువు అనేసరికి తరగతి గది, ఎదురుగా టీచర్ ఉండాల్సిన సాంప్రదాయ స్థితిలోనే మన విద్యారంగం ఉంది. ఆప్యాయంగానైనా టీచర్లు విద్యార్థులను తాకకుండా ఉండలేని సంస్కృతి మనది. అదేవిధంగా కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఒకరినొకరు తాకకుండా, కలిసి మెలిసి ఉండకుండా ఉండగలరా? ఉండవచ్చునా? కరోనా కాలంలో గడిపిన కఠోరమైన జీవితం తరువాత ప్రజలెవరూ ప్రమాణాల విషయంలో రాజీపడే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు, పాఠశాలల నిర్వాహకులు, విద్యార్థులు దీనికి సిద్ధం కావాల్సి ఉంటుంది. కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతానికి వేరే మార్గమేదీ కనిపించక దేశాలు మూతపడ్డాయి. చరిత్రలో ఎన్నడూ చూడని ఈ ఉపద్రవం నుంచి బయటపడటం ఎలాగో తెలియని అయోమయం రాజ్యమేలుతోంది. మళ్ళీ ఈ వ్యవస్థలను పునర్నిర్మించుకోవడం, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కి మనుగడ సాగించడం ఇప్పుడొక సవాలు. ప్రజలను కట్టడి చేసి ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టుకోవడం సాధ్యంకాదు కాబట్టి క్రమంగా లాక్డౌన్లు ఎత్తివేస్తున్నారు. అయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను కొన్ని సంవత్సరాలు తు.చ. తప్పక ఆచరించాల్సిందే. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూనే, ఒకరికి ఒకరు భౌతిక దూరం పాటించక తప్పదని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యారంగం మీద కోవిడ్ ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ప్రధానమైన అంశం. కిక్కిరిసిపోయి ఉండే భారతీయ తరగతి ఎలా మారబోతుంది? పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది చర్చకు వస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు దీనిమీద పూర్తిగా దృష్టిపెట్టనప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు యునెస్కో, ప్రపంచబ్యాంకు వంటివి కొన్ని ప్రతిపాదనలను చర్చకు పెట్టాయి. కరోనా వైరస్ బయటపడిన వెనువెంటనే విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్లమంది పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అమెరికా, ఐరోపా దేశాల్లో కొత్త విద్యాసంవత్సరం అడ్మిషన్లు నిలిచిపోయాయి. మనదేశంలో వార్షిక పరీక్షలను మధ్యలోనే ఆపేసి లాక్డౌన్ చేయాల్సివచ్చింది. కీలకమైన 10, 12 తరగతుల విద్యార్థులు ఇంకా పరీక్షలు పూర్తికాక అయోమయంలో ఉన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి కావాల్సిన ఎంట్రన్స్, అడ్మిషన్ టెస్టులు కూడా వీళ్ళు పూర్తి చేసుకోవాల్సి ఉంది. విద్యాసంవత్సరాన్ని జూన్ నుంచి కాకుండా సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. భారతీయ విద్యారంగం ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దది. దేశ జనాభాలో దాదాపు 50 కోట్లమంది చదువుకునే వయసులో అంటే ఐదేళ్లనుంచి 24 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే. దేశంలో దాదాపు 15 లక్షల స్కూళ్ళు, 40 వేలదాకా కాలేజీలు, దాదాపు వెయ్యి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో చదువుకునేవారి సంఖ్య దాదాపు 30 కోట్లు. ఇప్పుడు ఈ 30 కోట్లమంది ఇళ్లకే పరిమితమై ఉన్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు కోటిన్నర మంది విద్యార్థులున్నారు. వెంటనే విద్యాసంస్థలు తెరిచే పరిస్థితులు లేకపోయినా, మరో రెండు మూడు నెలల్లో విద్యాసంవత్సరం ప్రారంభించకపోయినా అది మొత్తం ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల మీద, విద్యార్థుల భవితవ్యం మీద తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. విద్యాసంస్థలు ఎప్పుడు తెరిచినా కోవిడ్ 19 నిబంధనలు కొత్త సవాలుగా మారబోతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందుతున్న దశలోనే పాఠశాల పరిసరాలు ఎలా ఉండాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్తో కలిసి ఒక ప్రోటోకాల్ రూపొందించింది. ఒక చెక్లిస్టు కూడా ఇచ్చింది. దాని ప్రకారం మొత్తం విద్యారంగ మౌలిక సదుపాయాలు మార్చవలసి ఉంటుంది. ఇది విద్యావ్యవస్థ స్వరూప, స్వభావాలను పూర్తిగా మార్చేసే విధంగా ఉంది. ప్రతి టీచర్ , ప్రతి విద్యార్థి మాస్కులు ధరించాలి. ప్రతి తరగతి గదిని రోజుకు కనీసం ఒక్కసారైనా (వీలైతే తరచుగా) నీటితో కడగడం, తుడవడం చేయాలి. ఆ గదిలోని ప్రతి వస్తువునూ శానిటైజ్ చేయాలి. విధిగా తరగతి గదికి అందుబాటులో శానిటైజర్లు లేదా సబ్బులు ఉంచాలి. విద్యార్థులు తరచుగా చేతులు కడుక్కునే సౌకర్యం, నిరంతరాయ నీటి వసతి కల్పించాలి. పాఠశాలల్లో తరచూ జరిగే అసెంబ్లీలు, ఆటలు, ఇతర సామూహిక కార్యక్రమాలు ఉండకూడదు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఒక్కో విద్యార్థికి మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండాలన్నది కోవిడ్ 19 నియమం. దీనిని పాఠశాలల్లో కూడా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతోంది. అంటే ఒక విద్యార్థికీ మరో విద్యార్థికీ మధ్య అన్ని వైపులా కనీస దూరం ఒక మీటర్ ఉండాలి. ఈ లెక్కన ఇప్పుడున్న తరగతి గదుల సంఖ్యను ప్రభుత్వ పాఠశాలల్లో అయితే రెండు మూడు రెట్లు, ప్రైవేటులో అయితే ఐదారు రెట్లు పెంచాలి. ఇప్పుడున్న తరగతి గది, మౌలిక వసతులు సమకూరడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు వీటిని అవసరానికి అనుగుణంగా విస్తరించడానికి కొన్ని వేలకోట్ల రూపాయలు అవసరం. ఈ సంక్షోభంలో ఒక్క మనకే కాదు, అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికి కూడా ఇది సాధ్యం కాదు. ఈ పరిస్థితులను అధిగమించడానికి మనం అనుసరిస్తోన్న విద్యాప్రణాళికలు, బోధనా పద్ధతులు పూర్తిగా మార్చడం ఒక్కటే పరి ష్కారం. సమస్యేమిటంటే గురుకులాలు మొదలు భారతదేశం గురుశిష్యులు ముఖాముఖిగా ఉండి బోధించే పద్ధతికి అలవాటు పడిన దేశం. సమాచారం తెలుసుకోవడానికి టెలివిజన్, సామాజిక మాధ్యమ వేదికలైన వాట్సాప్, ఫేస్బుక్ ఉన్నా చదువు అనే సరికి తరగతి గది, ఎదురుగా టీచర్ ఉండాల్సిన సాంప్రదాయ స్థితిలోనే మన విద్యారంగం ఉంది. ఆప్యాయంగానైనా టీచర్లు విద్యార్థులను తాకకుండా ఉండలేని సంస్కృతి మనది. అదేవిధంగా విద్యార్థులు ఒకరినొకరు తాకకుండా, కలిసి మెలిసి ఉండకుండా ఉండగలరా? ఉండవచ్చునా? ఇలాంటి పరిస్థితుల్లో మన బోధన, అభ్యాసన సంస్కృతికి సంబంధమే లేని దూరవిద్య మనకు పనికొస్తుందా? మన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? దూరవిద్య అంటే ఓపెన్ యూనివర్సిటీ లేదా ఓపెన్ స్కూల్ అనేది పాత భావన. ఇప్పుడు మనం థియేటరుకు వెళ్లకుండానే ఒక కొత్త సినిమా అమెజాన్, నెట్ఫ్లిక్స్లో ఎలా చూస్తున్నామో అలాగే పాఠశాలలకు వెళ్లకుండానే చదువుకోవచ్చు. అటువంటి సౌలభ్యత ఇప్పుడు అందుబాటులో ఉంది. అందులో మొదటిది టీవీ. మనదేశంలో దాదాపుగా విద్యార్థులున్న ప్రతి ఇంట్లో టెలివిజన్ ఉన్నది. దేశవ్యాప్తంగా కనీసం 70 శాతం ఇళ్లల్లో, దక్షిణాదిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 90 శాతం కంటే ఎక్కువ ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాబట్టి ఇదొక అవకాశంగా తీసుకుని కనీసం 40 శాతం పాఠాలు ఇంట్లోనే బోధించేలా చర్యలు తీసుకోవాలన్నది ఒక ప్రతిపాదన. మొబైల్ లెర్నింగ్ రెండో ప్రత్యామ్నాయం. దేశ జనాభాలో 93 శాతానికి పైగా మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 2019 మెకెన్సీ నివేదిక ప్రకారం దాదాపు 40 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. విద్యార్థుల్లో ఇది కనీసం 95 శాతంగా ఉంటుంది. దాదాపు 40 కోట్ల మందికి వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయి. పాఠశాల విద్యార్థులకు టెలివిజన్ పాఠాలు ప్రత్యామ్నాయం అనుకుంటే, కళాశాలలకు మొబైల్ సేవలను ఎక్కువగా వాడుకోవచ్చు. ఈ –లెర్నింగ్, డిజిటల్ లెర్నింగ్ లాంటివీ ఉన్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలన్నీ తమ పాఠాలను మూక్స్, మూడుల్ లాంటి కొత్త వేదికల ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నాయి. గూగుల్ కూడా విద్యాబోధనకు సంబంధించిన కొత్త టూల్స్ అందుబాటులోకి తెస్తోంది. ఎలక్ట్రానిక్ మాధ్యమాల వినియోగంతో తరగతి గదిలో బోధించే విషయాలను కుదించడంతో పాటు, పాఠానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా ప్రింట్ రూపంలో అందించవలసి రావొచ్చు. ఇప్పుడున్న సిలబస్ను కూడా సమీక్షించవలసి రావొచ్చు. అలాగే హాస్టల్స్, రెసిడెన్సియల్ విద్యాసంస్థలు భారీ మార్పులు చేయాల్సి రావొచ్చు. కోవిడ్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక్కో విద్యార్థికి కనీసం వంద మీటర్ల స్థలం అవసరం. అంటే ఒక్కో గదిలో ఒక్కరు, లేక ఇద్దరి కంటే ఎక్కువ మందిని ఉంచడానికి వీలులేదు. భోజనశాలలు, స్టడీ రూములు, లైబ్రరీలు, ఇతర సామూహిక స్థలాల్లో కూడా చాలా మార్పులు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థలో అన్ని దశల్లో కూడా సమూలమైన మార్పుల దిశగా ప్రయత్నాలు జరగాలి. ఇప్పుడున్న మౌలిక వసతులను షిఫ్టుల వారీగా వాడుకోవడం, దూర విద్యా వ్యవస్థలు, ఓపెన్ యూనివర్సిటీలను, అవి రూపొందించే పాఠ్యాంశాలను అందరికీ అందుబాటులోకి తేవడం అవసరం. ఇవన్నీ కావాలనుకుంటే కష్టమే. కానీ కరోనా అటువంటి కొత్త ప్రమాణాలను మన ముందుకు తెచ్చింది. కనీసం వ్యాక్సిన్ కనిపెట్టి, అది అందరికీ అందుబాటులోకి వచ్చే వరకైనా ఈ ఏర్పాట్లు అవసరం. కరోనా కాలంలో గడిపిన కఠోరమైన జీవితం తరువాత ప్రజలెవరూ ప్రమాణాల విషయంలో రాజీపడే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు, పాఠశాలల నిర్వాహకులు, విద్యార్థులు దీనికి సిద్ధం కావాల్సి ఉంటుంది. ప్రొ. ఘంటా చక్రపాణి వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement