breaking news
funky
-
ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి?
2026ని టాలీవుడ్ ఘనంగా ప్రారంభించింది. జనవరిలో చాలానే సినిమాలు రిలీజైనప్పటికీ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' చిత్రాలు ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఏడాదిని ఘనంగా మొదలుపెట్టాయి. మరి ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి? ఏయే చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి?సంక్రాంతి సినిమాల హడావుడి వల్ల జనవరి మూడో, నాలుగో వారంలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రాలేదు. చివరలో 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే మూవీ వచ్చింది గానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఫిబ్రవరి తొలివారంలో మాత్రం ఏకంగా 10 వరకు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో గుణశేఖర్ 'యుఫోరియా' మాత్రమే ఏమైనా వర్కౌట్ అవుతుందేమోనని అనిపిస్తోంది. దీనితో పాటు సుమతీ శతకం, శ్రీ చిదంబరం గారు, చాయ్ వాలా, హనీ, బ్లడ్ రోజెస్, ఆపరేషన్ పద్మ, బరాబర్ ప్రేమిస్తా లాంటి తెలుగు సినిమాలతో పాటు విత్ లవ్ అనే డబ్బింగ్ బొమ్మ కూడా తొలి వీకెండ్ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి? 'ఆరెంజ్' చిత్రాన్ని ఇదేవారంలో రీ రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది)ఇకపోతే వాలంటైన్స్ డే వీక్ అయిన రెండోవారంలో విశ్వక్ సేన్ 'ఫంకీ', సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాలతో పాటు సీతా పయనం అనే డబ్బింగ్ చిత్రం కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది. తమిళ సెన్సేషన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా ఈ వీకెండ్లోనే రావొచ్చని అంటున్నారు కానీ సరైన క్లారిటీ అయితే లేదు. అలానే లవ్ స్టోరి, మనసంతా నువ్వే లాంటి రీ రిలీజులు కూడా ఇదే వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ప్రేమికుల ఓటు దేనికి వేస్తారో చూడాలి?మూడో వారం సుహాస్ హీరోగా.. 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ హీరోయిన్గా చేసిన కామెడీ సినిమా 'హే భగవాన్' థియేటర్లలోకి రానుంది. టీజర్ అయితే బాగానే ఉంది. కాకపోతే రిలీజ్ తర్వాత హిట్టా? ఫట్టా అనేది తెలుస్తోంది. దీనితో పాటు 'చైనా పీస్' అనే తెలుగు మూవీ కూడా రాబోతోంది. ఈ వీకెండ్లోనే మృణాల్ ఠాకుర్ హిందీ మూవీ 'దో దివానే సెహర్ మే' రానుంది. రొమాంటిక్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. చివరి వారంలో ప్రస్తుతానికైతే 'స్క్రీమ్' అనే మూవీ మాత్రమే షెడ్యూల్ అయినట్లు సమాచారం. ఇప్పటికైతే ఫిబ్రవరిలో దాదాపు 20 మూవీస్ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ అయితే లేదు. మరి ఏమైనా సర్ప్రైజ్ హిట్స్ అవుతాయేమో చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్) -
ఫంకీలో రామ్ మిర్యాల పాడిన జోష్ సాంగ్.. విన్నారా?
మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఫంకీ. కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ధీరే.. ధీరే సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా సెకండ్ సాంగ్ను వదిలారు. 'ఒప్పేసుకుంట పిల్ల తప్పు అంత నాదేనంటు రట్టాటటావ్.. తప్పించుకోను పిల్ల సారీ నీకు చెప్పుకుంట రట్టాటటావ్.. అరెరె కుక్క పిల్లలాగా తిప్పుకోకే పిల్లా..' అంటూ పాట మొదలవుతుంది. అంటూ సాగే ఈ పాట ప్రారంభం నుంచి చివరి వరకు ఫుల్ జోష్తో కొనసాగింది. భీమ్స్ సంగీతం అందించిన ఈ పాటకు దేవ్ పవార్ లిరిక్స్ సమకూర్చాడు. రామ్ మిర్యాల ఆలపించాడు. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం ఫిబ్రవరి 13న విడుదలవుతోంది. చదవండి: నవీన్ పొలిశెట్టి ఆంధ్ర టూ తెలంగాణ సాంగ్ రిలీజ్ -
స్కూల్లో ఉన్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించా.. కానీ చివరకు
డైరెక్టర్ అనుదీప్ అనగానే అందరికీ 'జాతిరత్నాలు' సినిమానే గుర్తొస్తుంది. అంతకు ముందు ఓ మూవీ చేసినప్పటి.. దీని తర్వాతే బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూ, బయట.. ఎక్కడైనా సరే తనదైన కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు 'ఫంకీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఫిబ్రవరి 13న రిలీజ్. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ తన లవ్ స్టోరీ బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)ఎవరినైనా ప్రేమించారా? అని యాంకర్ సుమ, అనుదీప్ని అడగ్గా..'స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం ఆమెకు చెప్పలేదు. అంటే వన్ సైడ్ లవ్ అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి ఎక్కడో ఉంటుంది. కాలేజీలో ఎవరినీ లవ్ చేయలేదు. ప్రస్తుతానికైతే ప్రేమ, పెళ్లి మీద ఆసక్తి లేదు. పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు' అని క్లారిటీ ఇచ్చేశాడు.అయితే అనుదీప్.. ఇదంతా సీరియస్గానే చెప్పాడా? లేదా జోక్గా చెప్పాడా? అనేది తెలియదు. ఎందుకంటే చాలా కామెడీ విషయాన్ని కూడా సీరియస్ ఫేస్ పెట్టి చెబుతుంటాడు. కొన్నిసార్లు అయితే నిజాన్ని, అబద్ధాన్ని ఒకేలా చెబుతుంటాడు. ఇప్పుడు చెప్పింది కూడా ఆ రెండింటిలో ఏదా అనేది తెలియదు. మూవీ విషయానికొస్తే 'జాతిరత్నాలు' తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్తో 'ప్రిన్స్' తీశాడు. కానీ సరిగా ఆడలేదు. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'ఫంకీ'తో వస్తున్నాడు. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?(ఇదీ చదవండి: మేం రొమాన్స్ చేస్తుంటే.. అనుదీప్ బిగుసుకుపోయేవాడు) -
మేం రొమాన్స్ చేస్తుంటే.. అనుదీప్ బిగుసుకుపోయేవాడు
తెలుగు హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గానీ తర్వాత తర్వాత అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. గతేడాది రిలీజైన 'లైలా' మూవీతో ఘోరాతీ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు 'ఫంకీ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈ సందర్భంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూ వదిలారు. ఇందులో మాట్లాడిన విశ్వక్.. డైరెక్టర్ అనుదీప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: డబ్బులెక్కువిచ్చారని 'ఖైదీ 2' డ్రాప్.. ఎట్టకేలకు నోరు విప్పిన లోకేశ్)''ఫంకీ'లో రొమాంటిక్ సీన్స్ పీక్స్లో ఉంటాయి. ఎక్స్ట్రీమ్ అసలు. అదేంటో గానీ మేం సీన్స్ చేస్తుంటే.. మానిటర్ ముందు కూర్చున్న అనుదీప్ చాలా ఇబ్బందిగా అయిపోయాడు. చెప్పాలంటే బిగుసుకుపోయేవాడు' అని విశ్వక్ సేన్ చెప్పాడు. ఇదే విషయం గురించి హీరోయిన్ కాయదు లోహర్ మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్ జరుగుతుంటే మధ్యలో అనుదీప్ కట్ చెప్పేసేవాడు. మేమే ఎలాగోలా దాన్ని పూర్తి చేసేవాళ్లం అని చెప్పుకొచ్చింది.'లైలా' ఫ్లాప్ గురించి మాట్లాడిన విశ్వక్ సేన్.. నా ప్రతి సినిమా చూసే అమ్మ, అది యావరేజ్గా ఉన్నా తెగ పొగిడేసేది. 'లైలా'కి మాత్రం వింత అనుభవం ఎదురైంది. మూవీ చూసొచ్చిన తర్వాత నన్ను జాలిగా చూసింది అని చెప్పాడు. 'ఫంకీ' విషయానికొస్తే.. మూవీ డైరెక్టర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వస్తోంది. (ఇదీ చదవండి: తమిళ బ్లాక్బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)#Funky లో Romantic Scenes PEAKS లో ఉంటాయి... EXTREME అసలు..రొమాంటిక్ Scenes లో #Anudeep చాలా UNCOMFORTABLE అయిపోయాడు!!- #VishwakSen pic.twitter.com/DSigVrImla— Movies4u Official (@Movies4u_Officl) January 26, 2026 -
ధీరే... ధీరే
ధీరే... ధీరే అంటూ పాట అందుకున్నారు విశ్వక్ సేన్, కయాదు లోహర్. ఈ ఇద్దరూ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఫంకీ’ చిత్రంలోని పాట ఇది. సినిమాలో వచ్చే ఈ తొలి పాటను బుధవారం విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు దర్శకుడు కేవీ అనుదీప్ సాహిత్యం అందించగా సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘ఫంకీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఈ పాటలో విశ్వక్–కయాదుల జోడీ, పాటలోని కొత్తదనం యువతకు చేరువయ్యేలా ఉంటుంది’’ అని తాజాగా విడుదల చేసిన ‘ధీరే... ధీరే’ పాట గురించి యూనిట్ పేర్కొంది. విభిన్నమైన కథాంశంతో, ఆద్యంతం అలరించే హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమా ఉంటుందని, ‘ఫంకీ’ అనేది ప్రేక్షకులకు ఓ మంచి వినోదాల విందు అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
విశ్వక్-అనుదీప్ సినిమా.. చెప్పిన టైం కంటే ముందే రిలీజ్
గత కొన్ని సినిమాలతో వరస ఫ్లాప్స్ ఎదుర్కొన్న విశ్వక్ సేన్.. ఈసారి కామెడీ రూట్లోకి వచ్చాడు. 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్తో కలిసి 'ఫంకీ' అనే మూవీ చేస్తున్నాడు. ఇదివరకే టీజర్ రిలీజ్ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. గత నెలలో ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏప్రిల్ 3న థియేటర్లలో మూవీ విడుదలవుతుందని ప్రకటించారు. ఇప్పుడు హఠాత్తుగా దాన్ని రెండు నెలల ముందుకు తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: 'అవతార్' రెండు పార్ట్స్లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?)ముందు చెప్పినట్లు ఏప్రిల్లో కాకుండా ఫిబ్రవరి 13న 'ఫంకీ' విడుదలవుతుందని తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే షూటింగ్తో పాటు మిగిలిన పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే విడుదల తేదీని ముందుకు తీసుకొచ్చారా అనిపిస్తుంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు విశ్వక్ ఇటు అనుదీప్కి చాలా కీలకం.టీజర్ బట్టి చూస్తే ఇదో సినిమా డైరెక్టర్ కథ. దర్శకుడిగా విశ్వక్ కనిపిస్తుండగా.. హీరోయిన్ పాత్రలో నిర్మాత కూతురిగా కాయదు లోహర్ చేస్తోంది. జాతిరత్నాలు స్టైల్లో రెగ్యులర్ ఫన్ ఉండబోతుందనే అనిపిస్తుంది. మరి ఈసారి విశ్వక్ సేన్ ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)Your ticket to a crazy, fun-filled experience with #FUNKY arriving on 13th FEB! 🕺Fun for all. Madness for everyone. 100% Entertainment guaranteed. 😎In cinemas #FunkyFrom13thFeb 🤘🏻Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/kGHEGd2QkC— Sithara Entertainments (@SitharaEnts) December 15, 2025 -
విశ్వక్ సేన్- అనుదీప్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ కా దాస్గా పేరున్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). మాస్ చిత్రాలతో పాటు కామెడీ ఎంటర్టైనర్లతోనూ మెప్పించారు. ఈ ఏడాది లైలా అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం మరో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ ఫంకీ(FUNKY). ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కయాద్ లోహర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించారు. 2026 ఏప్రిల్ 3న సమ్మర్లో థియేటర్లలో ఫంకీ సందడి చేయనుందని తెలిపారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వీకే నరేశ్, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. Unlimited Laughter. 😆Unlimited Entertainment. 😎Unlimited FUN! 🥳#FUNKY GRAND RELEASE WORLDWIDE on APRIL 3rd, 2026. 🎬#FunkyFromApril3rd 🤘🏻Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @NavinNooli @Venkatupputuri… pic.twitter.com/KLdhiJrMWL— Sithara Entertainments (@SitharaEnts) November 6, 2025 -
జాతిరత్నాలు డైరెక్టర్ తో మాస్ కా దాస్ కామెడీ ఫిల్మ్
-
అచ్చం అలాగే..! అపురూపమైన ఆభరణాలు!
ముస్తాబు అచ్చమైన బంగారానికైనా మెరుగు అవసరం... మరి అచ్చతెలుగు అమ్మాయికి...?! వజ్రాలు, వైఢూర్యాలకైనా వన్నెలు అద్దాలి... మరి నిలువెత్తు సౌందర్యానికి..?! బంగారంతో పనిలేదు... వజ్రాల వెలుగులూ అక్కర్లేదు... ఎంపిక సులువుగా, అలంకరణ త్వరగా పూర్తవ్వాలి. అంతేనా... అందరిలోనూ కొత్తగా.. ఇంకాస్త బ్రైట్గా కనిపించాలి. ప్రత్యేకం అనిపించే డిజైన్లను ఎప్పటికప్పుడు సొంతం చేసుకోవాలి. అదీ తక్కువ ధరలో... బంగారు నగలకు పోటీగా... ఇమిటేషన్, ఫంకీ, కాస్ట్యూమ్, ప్లేటెడ్.. ఆభరణాలెన్నో అతివల మనసులను ఆకట్టుకుంటున్నాయి. ఇవే ఇప్పటి ట్రెండ్గా మారాయి. కళగానూ, మెరుపులుగానూ ఉండే ఈ డిజైనరీ ఆభరణాలను ఇష్టపడేవారు కొన్నేళ్లపాటు ధరించాలంటే మన్నిక కోసం జాగ్రత్తలూ ఎంతో అవసరం. బంగారు ఆభరణాలకు ఎలాంటి జాగ్రత్తలైతే తీసుకుంటామో వీటికీ అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. క్రిస్టల్స్, రంగురాళ్లు మెరుపు పోకుండా ఉండాలంటే ధరించిన ఆభరణాలను తీసి, భద్రపరిచేటప్పుడు మెత్తటి తడి, పొడి వస్త్రంతో(కళ్లజోడుతో పాటు వచ్చే మెత్తటి క్లాత్ లాంటిది అయి ఉండాలి) మృదువుగా తుడిచి, భద్రపరచాలి. రాళ్లు, క్రిస్టల్స్, లోహం, ముత్యాలు నీరు తగిలినప్పుడు రంగుమారవచ్చు. చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఈత కొట్టడం వంటి సందర్భాలలో ధరించిన ఆభరణాలను తీయడం మంచిది. పెర్ఫ్యూమ్, హెయిర్ స్ప్రే, నూనె, మద్యం... లాంటివి ఆభరణాల పై పూతను దెబ్బతీస్తాయి. అలాగే మెరుపు కోల్పోవచ్చు. మెరుపు కోల్పోయిన రాళ్లు, పూసలు, ముత్యాలు ధరించడానికి అనువుగా ఉండవు. బాడీ లోషన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో వాటిని జాగ్రత్తపరచాలి. ఆభరణాలను ధరించిన తర్వాత పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోకూడదు. పెర్ఫ్యూమ్ ఆభరణాలకు తగిలేలా స్ప్రే చేయకూడదు. అన్ని ఆభరణాలనూ ప్లాస్టిక్/పేపర్ బ్యాగ్లో పెట్టి ఒకే చోట ఉంచరాదు. ఆభరణాలు విరిగిపోవఛిం, రాళ్లు పోవడం వంటివి జరగవచ్చు. ఆభరణాల పెట్టెలో పట్టు/వెల్వెట్ పౌచ్లలో భద్రపరచాలి. ఆభరణాలు ధరించి నిద్రపోతే అసౌకర్యంగా ఉండటమే కాదు, అవి విరిగిపోవడం, రంగురాళ్లు ఊడిపోవడం.. వంటివి జరగవచ్చు. అలాగే ఎక్కువ ఎండపడే చోట కూడా భద్రపరచకూడదు. ఆభరణాలు పెట్టే బాక్స్లలో భద్రపరచాలి. ఆ బాక్స్ కూడా పెద్ద పెద్ద విభాగాలతో కూడి ఉండాలి. ఆభరణాలు ధరించేవారు... ఆభరణాలను తగిలించే హోల్డర్స్, కంఠాభరణాల స్టాండ్లు, ఆభరణాలు తీసుకోవడానికి అనువైన బాక్స్లను సిద్ధం చేసుకోవాలి. ప్రయాణాల సమయంలో ఆభరణాలను తీసుకువెళ్లేటప్పుడు అన్నీ ఒక చోట చుట్టేయకూడదు. దేనికది విడి విడిగా పెట్టాలి. సబ్బు, ఫేస్క్రీములు, మాయిశ్చరైజర్లు ఆభరణాలకు అంటకూడదు. దూది ఉండతోనూ, మెత్తని టూత్బ్రష్తో కొద్దిగా నీళ్లను అద్దుతూ శుభ్రపరచాలి. ఉన్న ఆభరణాలు కొద్దిగా పాడైపోయినా.. మరికొన్ని ఆభరణాలను జత చేసి కొత్తగా తయారుచేయించుకోవచ్చు. ఇందుకు ఇమిటేషన్ జ్యుయలరీ నిపుణులను సంప్రదించవచ్చు. ఆసక్తి ఉండాలేగాని పూసలు, రాళ్లు, చైన్లను ఉపయోగించి కొత్త తరహా ఆభరణాలను రూపొందించుకోవచ్చు. కొన్ని చైన్లను చెవి రింగులు గానూ, నెక్లెస్ ఎక్స్టెండర్స్గానూ వాడవచ్చు. లేదా పెంపుడు జంతువులకు ట్యాగ్గానూ వాడచ్చు. ఆభరణాల ఎంపిక, ధరించడం అనేది వ్యక్తిగత విషయం. కుటుంబసభ్యులకు లేదా స్నేహితులకు మీ గుర్తుగా ఆభరణాలను కానుకగా ఇచ్చేటప్పుడు వారి ఇష్టాయిష్టాలను గమనించాలి. మీరు ఇచ్చే కానుక ఎంత చిన్నదైనా తీసుకున్నవారికి అది ఆనందాన్ని కలిగించాలి. ఉపయోగపడాలి. బంగారు ఆభరణాలంటే అతివలకు అమితమైన ప్రీతి. ఆభరణాల అలంకరణలో పుత్తడిబొమ్మలా మెరిసిపోవాలని కోరుకుంటారు. కానీ, బంగారం అందరికీ అందుబాటులో లేదు. అలాగని చుక్కల లోకం చేరిన బంగారం ధరలు చూసి ఇప్పుడెవరూ డీలా పడటం లేదు. బంగారు ఆభరణాల డిజైన్లను పోలినవి, వాటిని మించినవి, రకరకాల లోహాలతో తయారైనవి, దుస్తులకు తగినవి... ఎన్నింటినో సృజనాత్మకత గల నిపుణులు కళ్లు చెదిరేలా సృష్టిస్తున్నారు. మార్కెట్లో కళ్ల ముందు పెడుతున్నారు. ఇమిటేషన్ ఆభరణాలు: బంగారు ఆభరణాలను పోలిన డిజైన్లు ఇప్పుడు అన్నిచోట్లా లభిస్తున్నాయి. వీటిని వన్గ్రామ్ గోల్డ్ జ్యుయలరీ అని కూడా అంటుంటారు. వీటిలో విలువైన రాళ్లు, రత్నాలను కూడా పొదిగి అందంగా తీర్చిదిద్దుతుంటారు. బంగారం మాత్రం ఉపయోగించని ఈ డిజైన్లు తక్కువ ధరకే లభిస్తూ అతివలను ఆకట్టుకుంటున్నాయి. వెండితో తయారుచేసిన ఆభరణాలపై పై పూతగా గోల్డ్ కోటింగ్ వేసే జ్యుయలరీ కూడా ఈ జాబితాలో చేరుతుంది. కాస్ట్యూమ్/ఫ్యాషన్ ఆభరణాలు: ఖరీదు చాలా తక్కువగా ఉండే లోహాలు, రంగురాళ్లు, పూసలతో తయారుచేసిన ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యుయలరీ అంటారు. ఇవి ఫ్యాషన్ దుస్తుల అందాన్ని మరింత బహిర్గతం చేసే విధంగా డిజైనర్లు సృష్టిస్తారు. చాలా వరకు దుస్తులకు మ్యాచింగ్ అయ్యే ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యుయలరీ అంటారు. ఈ ఆభరణాలు ఎప్పుడూ చాలా తక్కువ ఖరీదులో ఉంటాయి. 1930ల కాలంలో ఈ తరహా ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. జంక్/ఫంకీ ఆభరణాలు: కలప, పూసలు, ఎముకలు, బ్రాస్, టైటా, జంతువుల దంతాలు, కొమ్ములు, పట్టు దారాలు... ఇలాంటివాటితో తయారుచేసిన ఆభరణాలను జంక్ జ్యూయలరీ అంటారు. ప్రపంచంలోని స్త్రీలంతా బంగారు, వజ్రాలు, వెండి, ప్లాటినమ్ ఆభరణాలనే కోరుకుంటారు అనుకోవడం పొరపాటు. జంక్ జ్యుయలరీని ధరించడం ఇప్ప టి ట్రెండ్. ఫంకీ జ్యుయలరీగా కూడా ఇది ప్రసిద్ధి పొందింది.


