-
పాక్కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోగా.. న్యూజిలాండ్ తమ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. శ్రీలంకపై ఘన విజయం ద్వారా అనధికారికంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో.. టాప్-4లో నిలవాలన్న పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే, న్యూజిలాండ్ను దాటుకుని బాబర్ ఆజం బృందం ముందుకు వెళ్లాలంటే ఇంగ్లండ్పై ఊహించని రీతిలో విజయం సాధించాలి. కోల్కతా వేదికగా ఇంగ్లండ్ను 287 పరుగుల తేడాతో మట్టికరిపించాలి. లేదంటే టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. ఆ జట్టు విధించిన లక్ష్యాన్ని 3 ఓవర్లలోపే ఛేదించాలి. ఎంతటి పటిష్ట జట్టుకైనా ఇది అసాధ్యమే! అయితే, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయంటున్నాడు పాక్ సారథి బాబర్ ఆజం. ఈ మేరకు ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన బాబర్.. ‘‘క్రికెట్లో ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు.. ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శనతోనే ముగిస్తాం. రన్ రేటును భారీగా పెంచుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించాం. మైదానంలో వాటిని కచ్చితంగా అమలు చేస్తాం. తొలి 10 ఓవర్లపాటు ఎలా బ్యాటింగ్ చేయాలన్న దానిపైనే ప్రస్తుతం దృష్టి సారించాం. ఆ తర్వాత ఏం చేయాలో పరిస్థితులకు తగ్గట్లు చేసుకుపోతాం. ఒకవేళ ఫఖర్ జమాన్ 20-30 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయగలిగితే మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. ఓపెనర్ ఫఖర్ జమాన్తో పాటు ఆల్రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పాత్ర కూడా ఈ మ్యాచ్లో కీలకమేనని బాబర్ ఆజం ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అదే విధంగా కెప్టెన్సీ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని.. రెండు బాధ్యతలను తాను సమర్థవంతంగా నెరవేర్చగలనని బాబర్ స్పష్టం చేశాడు. చదవండి: గర్వంగా ఉంది.. మా విజయాలకు కారణం అదే.. వాళ్లు అద్బుతం: హష్మతుల్లా -
పాపం న్యూజిలాండ్.. మరీ ఇంత దురదృష్టమా.. ప్రపంచకప్ చరిత్రలోనే తొలి జట్టుగా..!
ప్రపంచ క్రికెట్ చరిత్రలో దురదృష్టవంతమైన జట్లు ఏవైనా ఉన్నాయంటే, అవి న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లే అని చెప్పాలి. ఫార్మాట్ ఏదైనా ఈ రెండు జట్లను దురదృష్టం అనునిత్యం వెంటాడుతూనే ఉంటుంది. మెగా టోర్నీల్లో వీరి బ్యాడ్లక్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవేదికపై పోటీపడుతున్నప్పుడు వీరి దురదృష్టం తారాస్థాయిలో ఉంటుంది. నోటి దాకా వచ్చిన విజయాలు, ఆస్వాదించకుండానే చేజారిపోయిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఈ రెండు జట్లలో ఓ జట్టైన న్యూజిలాండ్కు ఇలాంటి సందర్భం మరోసారి ఎదురైంది. 2023 వరల్డ్కప్లో భాగంగా పాకిస్తాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 400కు పైగా స్కోర్ చేసినప్పటికీ, వరుణుడు అడ్డుపడటంతో ఓటమిపాలైంది. ఈ ఓటమి కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు. ఇది ఏకంగా ఆ జట్టు సెమీస్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే ఓటమి. తప్పక గెలిచి తీరుతామనుకున్న మ్యాచ్లో ఓటమితో పాటు ఒక్కసారిగా సెమీస్ అవకాశాలు సంక్లిష్టం కావడంతో న్యూజిలాండ్ బాధ వర్ణణాతీతంగా ఉంది. ప్రపంచకప్ చరిత్రలో 400కు పైగా స్కోర్ చేసి ఓటమి చవిచూసిన తొలి జట్టు కివీసే కావడం విశేషం. హాట్ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్ టీమ్ వరుసగా నాలుగు పరాజయాలు మూటగట్టుకుని సెమీస్కు చేరకుండానే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే దిశగా సాగుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో (8 మ్యాచ్ల్లో 4 విజయాలు, 0.398) ఉన్న కివీస్ సెమీస్కు చేరాలంటే తాము తదుపరి ఆడబోయే మ్యాచ్లో భారీ విజయం సాధించడంతో పాటు సెమీస్ రేసులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లు తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడాల్సి ఉంటుంది. తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్ ప్రత్యర్ధి శ్రీలంక కావడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. ప్రస్తుత వరల్డ్కప్లో శ్రీలంక పేలవ ఫామ్లో ఉండటం కివీస్కు కలిరావచ్చు. ఒకవేళ ఈ జట్టును ఇక్కడ కూడా దురదృష్టం వెంటాడితే దేవుడు కూడా ఏమీ చేయలేడు. మరోవైపు న్యూజిలాండ్తో పాటు సెమీస్ రేసులో ఉన్న పాకిస్తాన్ ఇంగ్లండ్ను, ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను ఎదుర్కోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే, పాక్తో నిన్న జరిగిన మ్యాచ్లో కివీస్ 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతి) ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (95), గ్లెన్ ఫిలిప్స్ (41) విరుచుకుపడటంతో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం పాక్ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వర్షం పలు మార్లు అడ్డుపడి న్యూజిలాండ్ ఓటమికి పరోక్ష కారణమైంది. 25.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిన పాక్ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి పాక్ వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. డీఎల్ఎస్ ప్రకారం ఈ స్కోర్ న్యూజిలాండ్ స్కోర్ కంటే మెరుగ్గా ఉండటంతో పాక్ విజేతగా నిలిచింది. ఫకర్ జమాన్ (81 బంతుల్లో 126; 8 ఫోర్లు, 11 సిక్సర్లు) అజేయమైన మెరుపు శతకంతో పాక్కు జీవం పోశాడు. అతనికి కెప్టెన్ బాబార్ ఆజమ్ (66 నాటౌట్) సహకరించాడు. -
ఫఖర్ మెరుపుల ‘వాన’లో...
బెంగళూరు: ఇటు బ్యాటింగ్ మెరుపులు... అటు వర్షపు చినుకులతో చిన్నస్వామి స్టేడియం తడిసిపోయింది. ఈ క్రికెట్ మ్యాచ్ అభిమానుల్ని పరుగుల మజాలో ముంచింది. కానీ ఈ మజాను పూర్తిగా చవిచూడకముందే వర్షంతో ఆగిన ఆటలో డక్వర్త్ లూయిస్ (డీఎల్) పద్ధతి పాకిస్తాన్ను విజేతను చేస్తే... 400 పైచిలుకు చేసిన న్యూజిలాండ్ పరాజితగా మిగిలింది. పాక్ 21 పరుగులతో గెలిచి సెమీస్ అవకాశాలు సజీవంగా నిలబెట్టుకుంది. మొదట కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (94 బంతుల్లో 108; 15 ఫోర్లు, 1 సిక్స్) ఈ టోర్నీలో మూడో సెంచరీ సాధించగా, గాయంనుంచి కోలుకొని బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్ (79 బంతుల్లో 95; 10 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. తర్వాత పాకిస్తాన్ కష్టమైన లక్ష్యం వైపు ధాటిగా దూసుకెళ్లింది. వానతో మ్యాచ్ నిలిచేసరికి 25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. అప్పటి డక్వర్త్ లెక్కల ప్రకారం 25.3 ఓవర్లలో 179 చేస్తే కివీస్పై గెలుపు ఖాయం. కానీ పాక్ ఇంకో 21 పరుగులు ముందంజలో ఉంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 125 నాటౌట్, 8 ఫోర్లు, 11 సిక్స్లు) సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ సాధించాడు. కెపె్టన్ బాబర్ అజమ్ (63 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా అర్ధసెంచరీ సాధించాడు. కివీస్ ఓటమితో దక్షిణాఫ్రికా సెమీఫైనల్కు చేరింది. చెలరేగిన రచిన్, విలియమ్సన్ ముందుగా కివీస్ ఓపెనర్లు కాన్వే (39 బంతుల్లో 35; 6 ఫోర్లు), రచిన్ రవీంద్ర తొలి వికెట్కు 68 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. కాన్వే అవుటయ్యాక... రచిన్కు కెప్టెన్ విలియమ్సన్ జతయ్యాక పరుగుల వేగం పెరిగింది. ఇద్దరి స్ట్రోక్ప్లేతో బౌండరీలు మంచినీళ్ల ప్రాయంలా వచ్చేశాయి. 16వ ఓవర్లో జట్టు వంద పరుగులు చేరుకుంటే... కాసేపటికే 29 ఓవర్లోనే స్కోరు 200 దాటేసింది. ఆలోపే రవీంద్ర, విలియమ్సన్ చకచకా ఫిఫ్టీలు పూర్తిచేసుకొని శతకాలపై కన్నేశారు. ఈ క్రమంలో రచిన్ 88 బంతుల్లో సఫలం చేసుకోగా, విలియమ్సన్ 5 పరుగుల దూరంలోనే నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్కు 180 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన వారంతా తలా ఒక చేయి వేయడంతో కివీస్ స్కోరు 400 దాటింది. ఫిలిప్స్ (25 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్లు), చాప్మన్ (27 బంతుల్లో 39; 7 ఫోర్లు), మిచెల్ (18 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్), సాన్ట్నర్ (17 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్స్లు) మెరుగ్గా ఆడారు. ఫఖర్ విధ్వంసం వర్షంతో ఆగి..సాగిన మ్యాచ్లో చివరకు పాక్ విజయ లక్ష్యాన్ని డీఎల్ పద్ధతిలో 41 ఓవర్లలో 342 పరుగులుగా నిర్దేశించారు. అంటే సగటున ప్రతి ఓవర్కు 8 పరుగుల పైచిలుకే చేసుకుంటూ పోవాలి. ఇది వన్డేలో కొండంత లక్ష్యం. దీన్ని ఓపెనర్ ఫఖర్ జమాన్ విధ్వంసం కరిగించేలా చేసింది. మరో ఓపెనర్ షఫీక్ (4) వికెట్ పారేసుకున్నా... కెపె్టన్ బాబర్ ఆజమ్తో ధనాధన్ ఛేదనకు శ్రీకారం చుట్టాడు. 4 ఓవర్లలో 12/1 స్కోరుతో ఉన్నప్పుడు పాక్ ఇంకేం ఛేదిస్తుందిలే అనుకున్నారంతా! కానీ తర్వాత ఫఖర్ బ్యాట్ సిక్సర్లతో శివమెత్తడంతో న్యూజిలాండ్ ప్రధాన బౌలింగ్ దళమంతా కకావికలమైంది. ఒక ఓవర్లో 17, మరో ఓవర్లో 16, ఇంకో రెండు ఓవర్లలో 15 చొప్పున పరుగులు రావడంతో పాక్ స్కోరు ఒక్కసారిగా పుంజుకుంది. 20వ ఓవర్ రెండో బంతికే ఫఖర్ (63 బంతుల్లోనే) సెంచరీ పూర్తయింది. అప్పటికి జట్టు స్కోరు 145 పరుగులైతే ఇందులో వంద అతనొక్కడే చేశాడంతే ఫఖర్ బ్యాటింగ్ సునామీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాబర్ కూడా 52 బంతుల్లో అర్ధ శతకం సాధించగా, 26వ ఓవర్లో మళ్లీ వానొచ్చింది. ఆ తర్వాత తిరిగి కొనసాగలేదు. చిత్రమేమిటంటే సోధి వేసిన 25వ ఓవర్లోనే బాబర్ ఒక సిక్స్, ఫఖర్ రెండు సిక్సర్లతో 20 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత 3 బంతులకే ఆట ఆగిపోయింది. అంటే 25వ ఓవరే ఫలితాన్ని తలకిందులు చేసింది! ఆ ఓవర్ కంటే ముందు ఆగిపోతే కివీసే గెలిచేది! స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రిజ్వాన్ (బి) హసన్ 35; రచిన్ (సి) షకీల్ (బి) వసీమ్ 108; విలియమ్సన్ (సి) ఫఖర్ (బి) ఇఫ్తికార్ 95; మిచెల్ (బి) రవూఫ్ 29; చాప్మన్ (బి) వసీమ్ 39; ఫిలిప్స్ (బి) వసీమ్ 41; సాన్ట్నర్ నాటౌట్ 26; లాథమ్ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 401. వికెట్ల పతనం: 1–68, 2–248, 3–261, 4–318, 5–345, 6–388. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–0–90–0, హసన్ అలీ 10–0–82–1, ఇఫ్తికార్ 8–0–55–1, రవూఫ్ 10–0–85–1, వసీమ్ 10–0–60–3, సల్మాన్ 2–0–21–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) విలియమ్సన్ (బి) సౌతీ 4; ఫఖర్ నాటౌట్ 126; బాబర్ నాటౌట్ 66; ఎక్స్ట్రాలు 4; మొత్తం (25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 200/1. వికెట్ల పతనం: 1–6, బౌలింగ్: బౌల్ట్ 6–0–50–0, సౌతీ 5–0–27–1, సాన్ట్నర్ 5–0–35–0, ఫిలిప్స్ 5–1–42–0, ఇష్ సోధి 4–0–44–0, మిచెల్ 0.3–0–1–0. -
న్యూజిలాండ్పై పాకిస్తాన్ విజయం.. సెమీస్ రేసులో
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్కు పాకిస్తాన్ ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్పై 21 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పాకిస్తాన్ గెలుపొందింది. ఈ విజయంతో పాకిస్తాన్ తమ సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 21. 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160/1 వద్ద ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం తగ్గముఖం పట్టడంతో మ్యాచ్ను 41 ఓవర్లకు కుదించారు. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పాకిస్తాన్ టార్గెట్ను 342 పరుగులు కుదించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే సమయానికి పాకిస్తాన్కు 19. 3 ఓవర్లలో 182 పరుగులు అవసరమయ్యాయి. అయితే మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపిటికే మళ్లీ వరుణుడు రీ ఎంట్రీ ఇచ్చాడు. రెండో సారి ఆట నిలిచిపోయే సమయానికి పాకిస్తాన్ 179 పరుగులు చేసింది. అప్పటికే న్యూజిలాండ్ డీఎల్ఎస్ ప్రకారం.. 21 పరుగుల ముందంజలో ఉంది. ఈ క్రమంలో వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో పాకిస్తాన్ను డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతగా నిర్ణయించారు. జమాన్ సూపర్ ఇన్నింగ్స్.. కాగా పాకిస్తాన్ విజయంలో ఆ జట్టు ఓపెనర్ ఫఖార్ జమాన్ కీలక పాత్ర పోషించాడు. జమాన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 81 బంతుల్లో 8 ఫోర్లు ,11 సిక్స్లతో 126 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ బాబర్ ఆజం(66 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: WC 2023 NZ Vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్కప్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్కప్ చరిత్రలోనే
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన పాకిస్తాన్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో జమాన్ కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇమ్రాన్ నజీర్ పేరిట ఉండేది. 2007 వన్డే వరల్డ్కప్లో కింగ్స్టన్ ఓవెల్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 95 బంతుత్లో నజీర్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్తో నజీర్ రికార్డును జమాన్ బ్రేక్ చేశాడు. అదే విధంగా వరల్డ్కప్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన నజీర్ రికార్డును కూడా జమాన్ బద్దలు కొట్టాడు. జింబాబ్వేతో మ్యాచ్లో నజీర్ 8 సిక్స్లు బాదాడు. ప్రస్తుతం న్యూజిలాండ్తో మ్యాచ్లో 9 సిక్స్లు కొట్టిన జమాన్.. నజీర్ను అధిగమించాడు. మ్యాచ్కు అంతరాయం.. కాగా చెన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఆట నిలిచిపోయే సమయానికి పాకిస్తాన్ 21. 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో ఫఖార్ జమాన్(106), బాబర్ ఆజం(42) పరుగులతో ఉన్నారు. కాగా అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108) సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(95), గ్లెన్ ఫిలిప్స్(41) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. పాక్ బౌలర్లలో వసీం మూడు వికెట్లు సాధించగా.. రవూఫ్, ఇఫ్తికర్, హసన్ అలీ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: World Cup 2023: హార్దిక్ పాండ్యా అవుట్.. కెఎల్ రాహుల్కి ప్రమోషన్! వన్డే వరల్డ్ కప్లో View this post on Instagram A post shared by ICC (@icc)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement